అనుష్క శర్మ.. ఎప్పుడూ విరాట్ కోహ్లీతో తిరుగుతోంది.. అదీ ఇదీ అంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ తాజాగా అబ్దుల్ కలాం మరణం మీద రాసిన అనుష్క చేసిన ట్వీట్ అందరి చేత విమర్శలపాలుజేసింది. అనుష్కకు కనీసం అబ్దుల్ కలాం పేరు కూడా తెలియదా...? తెలియకుంటే ఎందుకు ట్వీట్ చెయ్యాలి...? అయినా విరాట్ కోహ్లీ గురించి కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కల్పించుకోవాలని ఇలా రకరకాలుగా అనుష్క మీద నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అలా నెటిజన్లు తన మీద విమర్శలు గుప్పించడంతో చివరకు తన తప్పును సరిదిద్దుకుంది. అవును ఇంతకీ అనుష్క శర్మ చేసిన తప్పేంటి...? అది కూడా అబ్దుల్ కలాం గురించి ఏ వివాదాస్పద ట్వీట్ చేసిందనేగా మీ అనుమానం. అయితే ఈ ఆర్టికల్ తప్పకుండా చదవాల్సిందే..
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించడంతో దేశ మంతావిషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా, అనుష్కశర్మ కూడా అబ్దుల్ కలామ్ మృతికి తన సంతాపాన్ని ట్విట్టర్లో తెలిపింది. అయితే, ఆమె తన ట్వీట్లో APJ Abdul Kalam కు బదులుగా ABJ Kalam Azad అంటూ ఆయన పేరును ఖూనీ చేసేసింది. దీంతో, దేశానికి ఎంతో సేవ చేసిన ఆ మహానుభావుడి పేరు కూడా సరిగ్గా తెలియదా అంటూ ఈ సుందరాంగిపై ట్విట్లర్లో విమర్శలు వెలువెత్తాయి. దీంతో, ఇది గమనించిన అనుష్క ఆ ట్వీట్ను తొలగించి మరోసారి పోస్టు చేసింది. అయితే, రెండోసారి కూడా మళ్లీ మరో తప్పు చేసింది. ‘APJ Abdul Kalam అని రాయడానికి బదులు ఈ సారిAPJ Kalam Azad అంటూ ట్వీట్ చేసింది. దీంతో, రెండవసారి కూడా అనుష్కశర్మ పొరపాటు చేయడంతో మరింత తీవ్రంగా ట్విట్టర్లో,ఫేస్బుక్లో ఆమెపై విమర్శలు వెలువెత్తాయి. ఆఖరుకు, తన నిర్లక్ష్యాన్ని గుర్తించి మూడవసారి కరెక్ట్గా కలామ్ పేరును పోస్ట్ చేసి ఆమె సంతాపం తెలిపింది.
అనుష్క శర్మ ట్వీట్ మీద వచ్చిన కామెంట్ల మీద మీరూ ఓ లుక్కెయ్యండి...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more