మాజీ రాష్ట్రపతి, దేశ శాస్ర్త సాంకేతిక రంగానికి ఐకానిక్ గా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అయితే తాజాగా ఓ మంత్రిగారు అబ్దుల్ కలాంకు శ్రద్దాంజలి ఘటించారు. అవాక్కయ్యారా! కానీ నిజం.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మహిళా మంత్రి మన మాజీ రాష్ట్రపతికి శ్రద్ధాంజలి ఘటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ స్కూల్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నీరా యాదవ్ అక్కడ ఉన్న అబ్దుల్ కలాం చిత్రపటానికి దండవేసి, తిలకం దిద్ది, దండం పెట్టారు. ఈ ఫొటోలు తొలుత స్థానిక వార్తా పత్రికల్లో, ఆ తరువాత సామాజిక వెబ్సైట్లలో దర్శనమివ్వడంతో.. అవి చూసిన వారందరూ అవాక్కయ్యారు. సజీవంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి నివాళులర్పించిన మంత్రిగారు ఎంతవరకు చదువుకున్నారో చెక్ చేయండి అని ఒకరు. ఆమెది కూడా నకిలీ డిగ్రీయేనేమో (కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీది నకిలీ డిగ్రీ అని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే) అని మరొకరు వ్యాఖ్యానించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్, స్కూల్ టీచర్ ఉమేశ్ ప్రసాద్ సమక్షంలో మహిళా మంత్రి కలాం ఫొటోకు దండ వేసినట్టు తెలిసింది. అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తడంతో తేరుకున్న మహిళా మంత్రి, తాను కేవలం కలాం ఫొటోకు బొట్టు పెట్టానని, అదివరకే ఎవరో దండ వేశారని వివరణ ఇచ్చారు.
అయితే మంత్రి గారి నిర్వాకం సోషల్ మీడియాలో దుమ్మెరేపుతోంది. నెటిజన్లు మంత్రిగారి మీద ఒంటికాలి మీద లేచారు. కనీసం బుద్ది లేకుండా ఇలా తెలివి తక్కువ పని చెయ్యడం ఏంటి అని మండిపడుతున్నారు. నెటిజన్లు అమ్మగారి మీద ఎలా కామెంట్ చేశారో మీరూ చూడండి...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more