దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో మూడో వంతు పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇది ఎవరో చెబుతున్న లెక్కలు కావు.. ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన ఎస్ఇసిసి 2011 వివరాలు తెలిపింది. ఎనిమిది దశాబ్దాల్లో తొలిసారిగా నిర్వహించిన ఈ గణన వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ గణన ద్వారా ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా పేదరిక నిర్మూలనా పథకాలను రూపొందించాలని జైట్లీ అన్నారు.
Also Read: అవును.. చెడ్డరోజులే వచ్చాయి: మోదీ
గ్రామీణ ప్రాంతాల వారికి గరిష్టంగా 5వేలు నెలసరి వేతనం పొందుతున్నారని సర్వేలో వెల్లడైంది. గ్రామీణుల్లో కేవలం 4.6 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని గణనలో తెలిపారు. వేతన ఆదాయం పొందే వారు దాదాపు పదిశాతం మంది ఉండగా ఎస్సి వర్గానికి చెందిన వారు 3.49 శాతం మంది, ఎస్టీ వర్గానికి చెందిన వారు 3.34 శాతం మంది వున్నారని ఎస్ఇసిసి 2011 వెల్లడించింది.
Also Read: పెంచలేక బిడ్డను దూరం చేసుకున్న తల్లి
ఈ గణాంకాల వివరాలను విడుదల చేసిన అనంతరం మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ గణన పత్రం గ్రామీణ భారత ముఖచిత్రాన్ని తెలియజేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన పథకాల రూపకల్పనలో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత సహాయకారిగా వుంటుందని ఆయన చెప్పారు.పేదరిక నిర్మూలన కోసం గ్రామపంచాయితీలతో కలిసి బడుగు కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తూ పథకాలను రూపొందిస్తామని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే దేశవ్యాప్తంగా వున్న మొత్తం 24.39 కోట్ల కుటుంబాలలో కేవలం గ్రామీణ ప్రాంతాలలోనే 17.91 కోట్ల కుటుంబాలున్నట్లు తేల్చింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more