సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం వలసల పరంపర తీవ్ర ఆందోళనల్లో ముంచేసింది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో ఒక్కొక్కరు క్రమంగా అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కాంగ్రెస్ నేతలు అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోగా.. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా రాజీనామా చేయనున్నారనే పుకార్లు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణాలూ వున్నాయి.
బుధవారం (01-07-2015) టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ నేరుగా జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో కలిశారు. 10 నిముషాలపాటు ఏకాంతంగా చర్యలు కూడా జరిపారు. ఈ భేటీ అనంతరం బయటికొచ్చిన వినోద్ కుమార్.. తాను కేవలం పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వచ్చినట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం వినోద్ మాటలను ఏమాత్రం నమ్మడం లేదు. పార్టీ మారే విషయమై వారిద్దరి మధ్య చర్చలు కొనసాగి వుంటాయని వారు భావిస్తున్నారు. ఎందుకంటే.. గతకొన్నాళ్ల నుంచి జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండడమే కాక ఆ పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా వినోద్ తో భేటీ అవడాన్ని చూస్తుంటే జానారెడ్డి పార్టీ వీడడం ఖాయమేనని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.
ఒకవేళ జానారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయిపోతే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పుట్టగతులు లేకుండా పోయిన తమ పార్టీని కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా పుంజుకునేలా ప్రయత్నాలు చేద్దామని భావించారు. కానీ.. ఇంతలోనే సీనియర్ నేతలు జంప్ కావడాన్ని చూస్తుంటే.. తెలంగాణలోనూ ఆ పార్టీ త్వరలోనే ఖాళీ అవడం ఖాయమని చెప్పకనే చెప్పవచ్చు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more