ఓటుకు నోటుకు వ్యవహారంలో ఏ1 ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. చర్లపల్లి జైల్ నుండి విడుదలైన తర్వాత అభిమానుల కోలాకలం మధ్య రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చర్లపల్లి .జైల్ నుండి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే జైల్ నుండి విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, తెలంగాణ మంత్రుల మీద విమర్శలు కురిపించారు. తెలంగాణ మంత్రులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ వారందరూ లెసలెస మాట్లాడుతున్నారని, సోడాలు కలిపేవాళ్లు, మోండా మార్కెట్లో ఆలుగడ్డలు అమ్మే వ్యక్తి మంత్రులయ్యారని.. సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
అయితే రేవంత్ మాటలే ఇప్పుడు మరోసారి జైలు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైకోర్ట్ రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ మీద సుప్రీంకోర్టుకు వెళ్లనుందని ఇప్పటికే సమాచారం. అయితే తాజాగా రేవంత్ రెడ్డి జైల్ నుండి విడుదలైన తర్వాత మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, పరుష పదజాలంతో రేవంత్ రెడ్డి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ అడ్వకేట్స్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. అయితే నిన్నటి రేవంత్ మాటలు, మీసం మెయ్యడం, మంత్రులను తిట్టడం లాంటి వాటిని సీడీ రూపంలో కోర్ట్ కు సబ్ మిట్ చెయ్యనున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ బెయిల్ మీద ఇప్పటికే వాదనలకు అంతా సిద్దం చేసిన తరుణంలో తాజాగా రేవంత్ మాటలు కూడా వాదనకు పనికి వస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ అడ్వకేట్స్ వేస్తున్న కేసును ఎగదోసింది తెలంగాణ ప్రభుత్వం అని సమాచారం. ఏదిఏమైనా కానీ రేవంత్ రెడ్డి మాటలే మరోసారి జైలు బాట పట్టిస్తాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more