తెలుగు రాష్ట్రాల్లో సెక్షన్ 8 మీద వివాదం రాజుకుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో విభజన చట్టంలో చెప్పినట్లుగా సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి కూడా తీసుకువస్తోంది. అయితే హైదరాబాద్ లో సెక్షన్ 8 పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో గవర్నర్ పెత్తనానికి ఒప్పుకునేది లేదని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. సెక్షన్ 8 ప్రజలు కోరుకున్నది కాదని, రెండు రాష్ట్రాల మధ్య సమాచారం కోసం, ప్రజల్లో నమ్మకం కలిగించడానికి మాత్రమే ఉద్దేశించిందని కొదండరామ్ అన్నారు. ప్రస్తుతం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉన్న హైదరాబాద్ లో సెక్షన్ 8 అవసరం లేదని, గవర్నర్, కేంద్ర పెత్తనం ఎందుకు అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ప్రజల స్వేచ్చకు భంగం కలిగినపుడు, ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగినపుడు గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి అప్పటికీ సంతృప్తి కలగకపోతే మాత్రమే గవర్నర్ తన అభిప్రాయాన్ని చెప్పవచ్చునని అన్నారు.
ఓటుకు నోటు కేసు తెర మీదకు రావడం వల్లే తాజాగా సెక్షన్ 8 గురించి వివాదం రాజుకుందని కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ పై పెత్తనం చెలాయిద్దామని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసును తప్పు దారి పట్టించేందుకే తెర మీదకు సెక్షన్ 8 ను తీసుకువస్తున్నారని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో న్యాయస్థానంలో తేల్చుకోవాలే తప్ప ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడ మంచిది కాదు అని పరోక్షంగా చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జేఏసీ తెలంగాణ స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు మరో ఉద్యమానికి కూడా వెనుకాడబోమని కోదండరామ్ హెచ్చరించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more