ఓటుకు నోటు వ్యవహారంలో కీలక మలుపు తిరిగిన ఘటన చంద్రబాబు నాయుడు స్టీఫన్ సన్ తో మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో టేపులను ప్రసారం చేసింది టి న్యూస్, సాక్షి ఛానల్. టి న్యూస్ అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందినది కాగా సాక్షి జగన్ మోహన్ రెడ్డికి చెందినది. అయితే రెండు ఛానల్స్ మొదట ఆడియో టేపులను ప్రసారం చేశాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడారని, అన్నీ చూసుకుంటానని కూడా అన్నారని ఆడియో ద్వారా తెలుస్తోంది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడు పెంచిన ఏపి ప్రభుత్వం తాజాగా ఈ రెండు ఛానల్స్ కు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు కేబుల్ చట్టం కింద జారీ చేశారు ఏఫి పోలీసులు.
మీ చానల్స్ లో వచ్చిన ఆడియోలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి.. మరి ఆడియో టేపుల మీద మీ వివరణ ఏంటీ అని నోటీసులు అందించారు. ఆడియో టపులు ఎక్కడి నుండి లభించాయి..? ఎవరు ఇచ్చారు..? అన్న దానిపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీస్ లో వెల్లడించారు. అయితే టీ న్యూస్, సాక్షి ఛానల్స్ కు మూడు రోజుల గడువు కూడా ఇచ్చారు. అయితే ఆ రోజుతో రెండు ఛానల్స్ కు ఇచ్చిన గడువు తీరిపోతుంది. మరి ఇక ముందు ఏపి సర్కార్ రెండు ఛానల్స్ పై ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది అన్నది తెలియాలి. అసలే దూకుడు మీదున్న ఏపి మీడియా ఛానల్స్ వ్యవహారంలోనూ అంతే దూకుడుగా వ్యవహారిస్తాయా లేదా వెనక్కి తగ్గుతాయా చూడాలి. మరోపక్క నోటీసులపై అటు టీ న్యూస్, ఇటు సాక్షిలు ఏం వివరణ ఇస్తాయో అన్ని అందరూ ఎదురు చూస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more