గవర్నమెంట్ జాబ్ అంటేనే తాపీగా ఎనిమిది గంటలు పనిచేశామా..నెల అయ్యేసరికి జీతం వచ్చిందా అన్నట్లు ఉంటుంది. జాబర్స్ కూడా అలానే ఉంటారు అయితే ఫుల్ డెడికేషన్ తో పని చేసే వాళ్లు చాలా తక్కువే ఉంటారు. కానీ ఓ సబ్ కలెక్టర్ మాత్రం సిస్నియర్ గా డ్యూటీ చేసింది. సిన్సియర్ గా డ్యూటీ చేసింది అంటే ఇదేదో వార్తా అనుకుంటున్నారేమో..? వికారాబాద్ సబ్ కలెక్టర్ ఓ మహిళ అయితేనేం అర్దరాత్రి పూట అక్రమాలు జరిగితే మాత్రం ఊరికేకూర్చోలేదు. అర్దరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒంటరిగా బైక్ మీద వెళ్లి మరీ డ్యూటీ చేసి అక్రమార్కుల గుట్టురట్టు చేసింది. వర్క్ మైండెడ్ అంటే ఇదీ అని అందరూ అనుకునేలా చేసింది ఈ సబ్ కలెక్టర్. అసలు ఆ సబ్ కలెక్టర్ చేసిన సాహసం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బెన్నూరు, తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలను రాత్రివేళల్లో చేపడుతున్నారు. పెద్ద పెద్ద బ్యాటరీలు పెట్టుకుని లైట్ల వెలుతురులో అక్రమంగా తవ్విపోసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ సబ్ కలెక్టర్ అలుగు వర్షిణి అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా తన వాహనాన్ని తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిలిపి.. అక్కడి నుంచి బైక్పై వెళ్లారు. లైట్ల వెలుతురు చూసిన ఇసుక నింపే లేబర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు.. పోలీసులు వచ్చారంటూ అక్కడి నుంచి పారిపోయారు. దాంతో సబ్ కలెక్టర్ వారిని వెంబడించారు. బెన్నూరు గ్రామం వద్ద కూలీలను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. బైక్లు, ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మొత్తానికి సబ్ కలెక్టర్ చేసిన సాహసం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏం జరుగుతుంది అని భయం లేకుండా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన వర్షిణికి సెల్యూట్.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more