అవును, తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పురాజేసిన ఓటుకు నోటు వ్యవహారం సీరియల్స్ లో లాగా ట్విస్ట్ ల మీద ట్విస్టులకు గురవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ ను లోబరుచుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డీల్ చేస్తున్న క్రమంలో తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ ను అరెస్టు చేశారు. అయితే తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు బయటికి విడుదలయ్యాయి. అయితే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు వ్యవహారంలో జోక్యం చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబును అరెస్టు చెయ్యాలని తెలంగాణ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ఏసీబీ అధికారులు మాత్రం ప్లాన్ మార్చారు. ప్లాన్ ఎ కాకుండా ప్లాన్ బిని అమలు చేస్తున్నారట. అవును అసలు ఈ ప్లాన్ ఎ, ప్లాన్ బిలు ఏంటో అనుకుంటున్నారా..? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
ప్లాన్ ఎ- తెలంగాణ ఏసీబీ అధికారులు ఆడియోలో ఉన్న చంద్రబాబు నాయుడు వాయిస్ ఆధారంగా ముందుగా అరెస్టు చేసి విచారించాలని నిర్ణయం తీసుకున్నారట.
కానీ తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు కోర్టు నుండి స్టే తెచ్చుకునే అవకాశం ఉండటంతో ఇది సరికాదని డ్రాప్ అయ్యారట.
ప్లాన్ బి- ఈ ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడును నిందితుడిగా కాకుండా సాక్షిగా తెలిసిన వివరాలను చెప్పాలని నోటీసులు పంపనుట్లు సమాచారం.
మొత్తానికి తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు వ్యవహారంలో చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. మరి దీన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more