ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి భూమి పూజను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో భూమిపూజను గ్రాండ్ గా చేసి తన బలాన్ని చాటే ప్రయత్నంలో ఉన్నారు బాబు. ఈ మేరకు ప్రధాని మోడీ పర్మీషన్ కూడా తీసుకున్నారు. మన ప్రధాని మోడీ భూమి పూజకు హాజరు కానున్నట్లు ముందే చెప్పిన బాబు ఇపుడు సింగపూర్, జపాన్ ప్రధానులను సైతం ఆహ్వానించనున్నారు. మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిని రప్పించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. అయితే ఎపుడు ఎలా ఆహ్వానించాలనేదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి భూమి పూజకు మూడు దేశాల అధినేతలు వస్తే కనుక చంద్రబాబుకు కొంచెం రిలీఫ్ దొరికినట్లవుతుంది.
రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్, జపాన్ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని, ఆ రెండు దేశాల అధినేతలను కూడా పిలవాలని అనుకొంటున్నామని చంద్రబాబు చెప్పినప్పుడు... ఆ ఆలోచన బాగుందని, పిలవండని మోదీ కూడా అన్నారు. ‘రాజధాని నిర్మాణంలో మీ వ్యూహం, ప్రయత్నం బాగున్నాయి. అమరావతి ఒక మంచి రాజధాని నగరం అవుతుందన్న నమ్మకం నాకు కలుగుతోంది. మీ కృషికి మా మద్దతు ఉంటుంది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సింగపూర్, జపాన్ ప్రధానులకు త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆహ్వానం పంపబోతున్నామని, తగినంత ముందుగానే వారికి సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు గనక ఫలిస్తే అంతర్జాతీయ మీడియలో అమరావతి పాపులర్ కావడంతో పాటు, ఓటుకు నోటు వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకు చాలా ప్లస్ అవుతుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more