రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తండ్రితో కలసి బయటకు వెళ్తున్నానని ధైర్యంగా, సంతోషంగా వెళ్లని ఆ చిన్నారికి తెలియదు అదే అమెకు చివరి రోజు అవుతుంది. తన చిన్నారి కోరిక మేరకు దాహం తీర్చుకునేందుకు ఆటోను నిలిపిన ఆ కన్న తండ్రికి తెలియదు అదే అమె పాలిట తులసి తీర్ధం అవుతుంది. తన ఎదుటే తన చిన్నారిని రాబంధులు ఎత్తుకుని వెళ్తుంటే.. ఏం చేయలేని అసహాయ స్థితిలోకి జారుకున్న తండ్రి పడిన మనో వేదన చెప్పనలవి కాదు. తన తండ్రి నుంచి రాబందుల చేతుల్లోకి పడిన ఆ చిన్నారికి ఊహించని పరిణామే ఎదురైంది.
తమ కామవాంఛ తీర్చుకునేందుకు ఐదుగురు మానవ మృగాలు చిన్నారిపై విరుచుకుపడి అత్యంత పైశాచికంగా కబళించివేసాయి. అంతేకాదు అమెపై దాడి చేసి మరీ హతమార్చాయి. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో బంట్వారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బాలిక తన తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లి ఆటోలో వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న నలుగురు వ్యక్తులు తండ్రిపై దాడి చేసి తొమ్మిదవ తరగతి చదువుతున్న చిన్నారిని ఎత్తుకెళ్లిపోయారు.
అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పాశవిక లైంగిక దాడి జరిపి అనంతరం ఆమె ప్రాణాలు చిదిమేశారు. తండ్రి ఫిర్యాదు చేయడంతో గాలింపులు జరిపిన పోలీసులు శుక్రవారం బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి ఓ కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ ఘటన జరగడానికి ఆటో డ్రైవర్ ప్రమేయం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం శ్రనివాస్ తెలిపారు. కాగా ప్రస్తుతం కిడ్నాప్, మర్డర్, సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వీటితో పాటు సిఒసిఎస్ఒ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు బంట్వారం ఎస్ ఐ రవిందర్ తెలిపారు. పోస్టుమార్టమ్ రిపోర్టు ఆధారంగా సెక్షన్లను పోందుపరుస్తామని చెప్పారు.
.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more