నారా లోకేష్.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తున్న పేరు. గత కొంత కాలంగా పార్టీలో కీలకంగా మారి.. ప్రస్తుతం పార్టీలో నెంబర్ టూగా చక్రం తిప్పుతున్న నేత. అయితే నారా లోకేష్ గత వారం అమెరికాకు పర్యటన కోసం వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసారు. అయితే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ కూడా విదేశాలకు వెళ్లారు. అటు ఏపి ముఖ్యమంత్రి కొడుకు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు ఇద్దరూ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లడంతో మీడియాలో ఇద్దరిని పోలుస్తూ వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరు వెళ్లిన దేశాలు వేరే, వారి పరిస్థితులు వేరే అయినా మీడియా వాళ్లు మాత్రం వారి ఇద్దరి మధ్య పోలీకలు, భేదాలు అంటూ వరుస కథనాలు ప్రచారం చేశారు. అయితే దీనిపై లోకేష్ స్పందించారు. కేవలం స్పందించడం ఒక్కటే కాదు కేటీఆర్ గురించి ఓ మాట కూడా అన్నారు.
కేటీఆర్ ఓ మంత్రిగా పర్యటించారు కానీ నేను మాత్రం ఓ మామూలు కార్యకర్తలా పర్యటించాను అని అన్నారు. ఏపిలో వ్యాపారానికి అనువైన పరిస్థితులను గురించి వివరించడానికి అమెరికాకు వెళ్లాడట. కేటీఆర్ ఓ మంత్రిగా వెళ్లి రెండు డీల్స్ మాత్రమే కుదుర్చుకు వచ్చాడని .. కానీ తమ అధినేత, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే పర్యటనలో చాలా డీల్స్ కుదురుతాయని అన్నారు. అయితే కావచ్చు కానీ ఓ మామూలు కార్యకర్తలా వెళ్లిన లోకేష్ కు నిజంగా మామూలు కార్యకర్తకు లభించే మర్యాదలు లబించాయా..? లోకేష్ మామూలు కార్యకర్తే అయితే ఇంత హడావడి ఉండేదా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలి. మరి కేటీఆర్ పర్యటనకు సంబందించి ఎలాంటి వివాదాలు రాలేదు. కానీ లోకేష్ పర్యటనలో మాత్రం డబ్బులు పెట్టి మరీ బిల్డప్ కోసం ఒబామాను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయినా పాపం.. లోకేష్ గురించి పల్లెత్తి మాట మాట్లాడకుండానే కేటీఆర్ మీద విమర్శలు చెయ్యడం ఏమైనా బాగుందా అని కూడా కొందరు అనుకుంటున్నారట.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more