కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ నేతలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు ఇలా ఎవరెవరి ఫోటోలను ప్రచురించేందుకు వీలు లేదని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తాజాగా అదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రభుత్వ ప్రకటనలలో.. కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ( భారత ప్రధాన న్యాయమూర్తి, అనగా సీజేఐ) పోటోలు మాత్రమే ప్రచురించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వ్యవహారాలలో న్యాయస్థానాల జోక్యం చేసుకోవద్దని కోరిన కేంద్రం వాదనను జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్రభుత్వ ప్రకటనల జారీలో ఒక విధానం కానీ, చట్టం కానీ లేవని అందుచేత న్యాయస్థానానికి వాటిలో జోక్యం చేసుకునే అధికారం వుందని దర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలలో ఎవరి ఫోటోలనూ ప్రచురించరాదని ప్రముఖ విద్యావేత్త ఫ్రోఫెసర్ ఎన్ ఆర్ మాదవ మెనన్ చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చుతూ ఈ మేరకు తీర్పును వెలువరించింది. వివిధ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై సుప్రీం కోర్టు బుధవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి త్రి సభ్య కమిటీని వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆయా ప్రకటనల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ నియమించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఫోటోలు కూడా వాడరాదని స్పష్టం చేసినట్టయింది. ప్రభుత్వం ప్రకటనల పేరుతో రాజకీయ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగంతో ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాససం ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోల వాడకాన్ని నిషేధించింది..
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more