తన శిక్షను, జరిమానాను రద్దు చెయ్యాలని కోరుతూ సత్యం రామలింగరాజు నాంపల్లి కోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. తన ఆరోగ్యం సహకరించడం లేదని పిటిషన్ లో రామలింగరాజు వివరించారు. అలాగే తాను చేసిన సామాజిక కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకొని శిక్షను రద్దు చెయ్యాలని రామలింగరాజు కోర్టును కోరారు. ఇప్పటికే 33 నెలల జైలు శిక్ష ను అనుభవించినందుకు గాను జైలు శిక్ష, జరిమానాలను రద్దు చెయ్యాలని కూడా అతను కోరారు.
సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజుకు ఏడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 5.50 కోట్ల జరిమానా విధించింది. రామరాజు, రామలింగ రాజులు మినహా మిగిలిన వారికి మాత్రం కేవలం 25 లక్షల జరిమానాను విధించింది కోర్ట్ . 14 వేల కోట్ల కుంభకోణంలో మొత్తం 216 మంది సాక్షులను విచారించారు. సత్యం కేసులో 120పి, 409, 406, 467, 471, 477, 201 సెక్షన్ ల కింద శిక్ష ను వేసింది. ఒక్కో సెక్షన్ లో 10 నుండి 15 లక్షలు కలిపి 5.5 కోట్ల భారీ జరిమానాను విధించింది. కేసులో సాక్షులను తారుమారు చెయ్యడాన్ని కూడా కోర్టు పరిగణలోకి అయితే రామలింగరాజు తన శిక్షను తగ్గించాలని కోరినా కోర్టు మాత్రం పట్టించుకోలేదు. గతంలోనే రామలింగరాజు అభ్యర్థనను పట్టించుకోని కోర్టు తాజా పిటిషన్ పై ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more