విదేశీ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ యూపీఏ సర్కార్ అవినీతిపై పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. దేశానికి లక్షల కోట్ల ఆదాయవనరులను సమకూర్చే కోల్బ్లాక్ల కేటాయింపులో యూపీఏ అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. పెన్నులు.. కర్చీఫ్ లు ఇచ్చినంత తేలిగ్గా వాటిని ఇచ్చేసిందని, ఫలితంగా రూ.లక్షల కోట్ల ఆదాయాన్ని దేశం కోల్పోయిందని దుయ్యబట్టారు. మనం ఎవరికైనా పెన్ను ఇచ్చినా.. సరైన వ్యక్తికే ఇస్తున్నామా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. కానీ యూపీఏ సర్కార్ మాత్రం లక్షల కోట్ల విలువైన కోల్బ్లాక్ల కేటాయింపులో ఆ మాత్రం ఆలోచన కూడా చేయలేదు అని ప్రధాని విమర్శించారు. పూర్తి అవినీతిమయంగా మారిన కోల్బ్లాక్ కేటాయింపులపై చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రద్దుచేసిందని, మాజీ ప్రధాని పేరు కూడా ఈ వివాదంలో ప్రముఖంగా వినిపించిందని గుర్తుచేశారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే 204 కోల్బ్లాక్లకుగాను కేవలం 20 బ్లాక్లను వేలంవేస్తే 2 లక్ష ల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగ్ పేర్కొన్న 1.76 లక్షల కోట్లకు మించిన ఆదాయాన్ని కోల్బ్లాక్ల వేలంలో రాబట్టామన్నారు.
ప్రధానిగా నా పది నెలల అనుభవంతో ఓ మాట చెబుతున్నా.. భారత్ ఇంకా పేదరికంలో ఉండటానికి కారణాలేవీ కన్పించడం లేదు అని వ్యాఖ్యానించారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్నాయని, దేశాన్ని అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలు అధిరోహింపజేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతమండలి లో శాశ్వతసభ్యత్వం భారత్ హక్కు అని స్పష్టం చేశారు. ప్రపంచశాంతి కోసం భారత్ ఎన్నో త్యాగాలు చేసిందని, మొదటి ప్రపంచ యుద్ధంలో 14 లక్షలమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ వారి కోసం పోరాడటం సహజం. కానీ మరొకరి కోసం ప్రాణాలర్పించడమే అసలైన త్యాగం. ఈ వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుందని భావిస్తున్నా అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏ దేశం వెళ్లినా యుపిఎ అవినీతి, కోల్ స్కాంల గురించి మాత్రం మోదీ వాయిస్తున్నాడు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more