యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 వెల్లడయ్యాయి. దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. అయితే సివిల్ పరీక్షల్లో జాట్లకు రిజర్వేషన్ కల్పించడంపై కోర్టులో వివాదం సాగుతోంది. కోర్టులో వివాదం ఉండగానే యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ప్రధాన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 27 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది సివిల్స్ పరీక్షకు హాజరయ్యారు.
అయితే యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల నోటిఫికేషన్లో జాట్ల విషయాన్ని పేర్కొనలేదు. గతంలోని యూపీఏ ప్రభుత్వం జాట్లకు కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వారిని ఓబీసీల్లో చేర్చింది. అయితే, దీనిపై కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో కేంద్ర నిర్ణయం చెల్లుబాటుకాదని పేర్కొంటూ తుది తీర్పు వెలువరించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో ఆ తీర్పు వచ్చాకే ఫలితాలు వస్తాయని భావించగా.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించింది. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.inలో ఉంచింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more