నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద సిమి ఉద్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడి కామినేని అస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) ఇవాళ సాయంత్రం మరణించారు. ఈ నెల 4న సిమీ ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొని పట్టుకోబోయిన సిద్దయ్య గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకు చివరి శ్వాసను వదిలారు. నాలుగు రోజుల నుంచి సిద్దయ్యను బతికించేందుకు కామినేని అస్పత్రి వైద్యులు శతవిధాల చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కామినేని అస్పత్రిలో బావోద్వేగ వాతావరణం అలుముకుంది. సిద్దయ్య అమర్ హై అంటూ స్థానికులు, పోలీసులు, బంధువులు నినాదాలతో హోరెత్తించారు.
దుండగుల కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకుపోగా, 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటివరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది. సుమారు 8 గంటలపాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినా, కడుపులోని బుల్లెట్ వల్ల ప్రాణానికి ప్రమాదం లేకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్ను కూడా వదిలేశారు. అస్పత్రిలో చేరినప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే వున్న సిద్దయ్య.. అదే స్థితిలో అమరుడయ్యాడు.
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసేందుకు కామినేని ఆస్పత్రికి వచ్చిన ఆయన భార్య ధరణికి పురిటినొప్పులు రావడంతో ఆదే అస్పత్రిలోని ప్రసూతివార్డులో చేర్పించారు. భర్త అస్పత్రిలో చేరిన రోజునే అమె రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టినందుకు సంతోషం ఏ కోశాన లేకుండా ఇప్పుడా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఇరవై ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది వారి కుటుంబం. 2012లో పోలీస్ జాబ్ లో జాయిన్ అయిన సిద్దయ్య.. సరిగ్గా ఎన్ కౌంటర్ జరిగే రెండు రోజుల ముందు సెలవు కోరగా, మరో రెండు రోజుల ఆగి తీసుకోమని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ లోపు ఘటన చోటుచేసుకోవడంతో తీవ్రంగా గాయపడిన సిద్దయ్య అసువులు బాసారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more