నల్గొండ జిల్లాలో పోలీసులపై దాడికి పాల్పడి మగ్గురిని హతమార్చి, మరికోందరిని క్షతగాత్రులుగా చేసిన కేసులో నిందితులను మట్టుబెట్టిన దగ్గరనుంచీ.. తెలంగాణ జిల్లాల్లో పచ్చని పల్లెలన్నీ గజగజ వెనుకుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు వరుస ఎన్ కౌంటర్ ఘటనలతో భీతిల్లుతున్న పల్లెసీమల్లో.. కొత్త వారు కనబడితే. చాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తేే.. పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. తెలంగాణలోనే కాదు అటు నవ్యాంధ్రలోనూ ఇవే పరిస్థుతులు ఉత్పన్నమవుతున్నాయి.
నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మురళీ అనే వ్యాపారిని కారు లిఫ్ట్ అడిగి నిలువునా దోచుకుని పక్కనున్న పోలాల్లోకి పారిపోయిన అగంతకుల సంబంధించిన సమాచారం కూడా సంచలనానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తి వద్ద పోలీసులపై తిరగబడిన సిమీ కార్యకర్తలను మట్టబెట్టడంతో మరోమారు పల్లెలు భయం గుప్పిట్లో చిక్కకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తవారు.. అందునా.. ఆయుధాలు కలిగి సంచరించే వారిని చూస్తే.. జనం తక్షణం పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.
ఈ తరుణంలో ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం అంతారం గ్రామ శివార్లలో ఇద్దరు సాయుధులైన అగంతకులను చూసి గ్రామస్థులు భీతిల్లారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హై అలర్ట్ ప్రకటించారు. షాబాద్ నుండి రాకపోకలున్న అన్ని ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. గ్రామాలన్ని క్షణ్ణంగా తనికీలు చేస్తున్నారు. సాయుదులు లారీ లోంచి దిగి అడువులలోకి పారిపోయారని స్థానికులు చెప్పడంతో ఆ ప్రాంతమంతా పోలీసులు జల్లెడ పడుతున్నున్నారు. విజయవాడలో మురళీ అనే వ్యాపారిని బెదింరించిన వాళ్లు వీళ్లేనా.. లేక నల్గొండ ఎన్కౌంటర్లో తప్పించుకున్న ముష్కరులా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more