తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి అంకురార్పణ చేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ఫీజు విధిస్తు తీసుకున్న చట్టానికి ఏ చట్టం సహకరించింది? అంటే అన్నింటికి సమాధానం ఒక్కటే. గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి పాలన సమయంలో చేసిన కీలక మార్పులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పు రాజేసింది. సెక్షన్ 72 (2) ప్రకారం.. అపాయింటెడ్ డేకి ముందురోజు వరకు ఉభయ రాష్ట్రాల్లో చెల్లుబాటయ్యే పర్మిట్ ఉన్న రవాణా వాహనాలకు సంబంధించి ఏ రాష్ట్రమూ టోల్ ఫీజు కానీ, ఎంట్రన్స్ ఫీజు కానీ, అలాంటి స్వరూప స్వభావాలున్న ఇతర చార్జీలను కానీ విధించకూడదు. ఆయా రాష్ట్రాలను సంప్రదించి ఎంట్రన్స్ ఫీజు లేదా ఇతర చార్జీల విధింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వవచ్చు. 2014 జూన్ ఒకటో తేదీన రాష్ట్రపతి పాలన సమయంలోనే ఒక జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరిట ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన లక్ష్మీపార్థసారథి దానిని జారీ చేశారు.
2015 మార్చి 31వ తేదీ వరకు క్వార్టర్లీ ట్యాక్స్ ను రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చెల్లించినా అది రెండు రాష్ట్రాలకూ చెల్లించినట్లే. ఒకవేళ ఏదైనా ఉంటే ఇరు రాష్ట్రాలూ కలిసి నిర్ణయం తీసుకుంటాయి- అని జీవో జారీ చేశారు. రెండు రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి అన్న ఆ ఒక్క పాయింట్ తో తెలంగాణ కొత్త జివోను విడుదల చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి తెర లేచింది. విభజన చట్టంలోని 72(1) సెక్షన్ ప్రకారం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2015 మార్చి 31 తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చంటూ కొత్త అర్థం చెప్పినట్లయింది. చట్టంలోని సెక్షన్ 72(1)లో పర్మిట్ ఉభయ రాష్ట్రాల్లోనూ చెల్లుబాటు అవుతుందని, అందులో త్రైమాసిక పన్ను గురించి ప్రస్తావనే లేదని, కానీ దాని కోసమే గవర్నర్ జీవో జారీ చేశారని ఆరోపిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోనూ చెల్లుబాటు అయ్యే పర్మిట్ ఉన్న వాహనాలకు ఏ తరహా ఫీజులు, చార్జీలు వసూలు చేయరాదని విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా.. గవర్నర్ ఇచ్చిన జీవో అండతో పన్ను విధింపు అవకాశాన్ని చేజిక్కించుకుంది. విభజన చట్టంలో ‘పన్ను’ విధించకూడదని ఎక్కడా లేదని, ఎంట్రీ ట్యాక్స్ విధించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అధికారులు వాదిస్తున్నారు. దాని ఆధారంగానే ఎలాంటి పన్నునైనా విధించే అధికారం తమ ప్రభుత్వానికి ఉందని హైకోర్టులోనూ వాదిస్తున్నారు. మొత్తానికి గవర్నర్ గారు చేసిన ఓ జీవో ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more