పద్ధతి మార్చుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ హితవు పలికారు. అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా కొంత మంది మంత్రులు ఇంకా స్వంత శాఖలపై పట్టుసాధించలేదని మండిపడ్డారు. అవినీతికి తావులేకుండా మంత్రులు పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని, ఇంకా ఉద్యమకారులుగా మాట్లాడితే ఉపయోగం ఉండదని సిఎం కెసిఆర్ మంత్రులకు సూచనలు చేశారు. మరో రెండు నెలలు గడిస్తే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని, ఇంకా కేటాయించిన శాఖలపై ఇప్పటికీ పట్టు సాధించకపోతే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని కెసిఆర్ సూచించారు. ఇదే సమయంలో పనితీరు ఆధారంగా మంత్రులకు గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా దూకుడు పెంచాలని ఆదేశించారు. మిషన్కాకతీయ పనుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వేసవికాలం పూర్తయ్యేనాటికి రెండున్నరనెలల్లోగా నిర్దేశించిన చెరువుల పనులు పూర్తి కావాలని కోరారు. వాటర్గ్రిడ్ పనులును వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే 25 వేల పోస్టుల భర్తీ చేపట్టాలని, దీనికి సంబంధించి కొద్దిరోజుల్లోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఐకెపి ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల సమస్యలను పరిష్కరించాలని, అందుకు అనుగుణంగా త్వరలో వారితో సమావేశం కావాలని సిఎం నిర్ణయించారు.
పార్టీ సంస్థాగత వ్యవహా రాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శుల మధ్య సయోధ్య లేకపోవడం, అధికారులతో సమన్వయ లోపం తదితర అంశాలపై కేసీఆర్ చర్చించారు. శాసనమండలి పట్టభద్రుల నియోజవకర్గ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను సీఎం ప్రస్తావించారు. మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో ఎదురైన ఓటమి భవిష్యత్తులో పునరావృతం కావద్దని పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల మంత్రులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను విశ్లేషించారు. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాలని, అన్నింట్లోనూ గెలుపొందేలా ఆయా జిల్లాల మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అలాగే జీహెచ్ఎంసీ, వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా కేడర్ను బలోపేతం చేయాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more