కృష్ణానదీ జలాల వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇటు సుప్రీం కోర్టులోనూ, బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్లోనూ భాగస్వామ్య రాష్ట్రాల మధ్యన వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో కృష్ణాజలాల వివాదంపై విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి మూడు వారాల్లో తమ అభిప్రాయాలు అభ్యంతరాలను తెలుపుతూ కౌంటర్లు, రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను ఆదేశించింది. అంతే కాకుండా ఈ వివరాలన్నింటిని మూడు పేజీల్లోపే పొందుపరిచి సమర్పించాలని మూడు రాష్ట్రాలకు సూచించింది. ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీం కోర్టు అదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరాలు తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నీటి కేటాయింపుల్లో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందినీ, కొత్తరాష్ట్రం గా ఏర్పడ్డ తమ వాదనలు కూడా విని, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ వాదనపై సుప్రీం కోర్టు స్పందిస్తూ నదీజలాల వివాదం ఎక్కువ కాలం అపరిష్కృ తంగా ఉండరాదని అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచా రణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణానది జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ 2010 డిసెంబర్లో ఇచ్చిన తీర్పు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అది పరిష్కారమయ్యే వరకూ తీర్పును భారత ప్రభుత్వ గెజిట్లో ప్రచురించరాదని, అమలు చేయరాదని సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడడంతో... ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం కృష్ణానది ట్రిబ్యునల్లో తమకు అన్యాయం జరిగిందని, తమ వాదనలు కూడా వినాలని, లేదంటే మరో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ట్రిబ్యునల్ తీర్పును తక్షణం గెజిట్లో ప్రచురించి, అమలు చేయాలంటూ కర్ణాటక, మహారాష్ట్రలు కూడా సుప్రీంను ఆశ్రయించాయి. అయితే గతంలో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కొత్తగా ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణ తరఫు న్యాయవాదులు వాదించారు. మరి ఏప్రిల్ 29న జరిగే విచారణ ఎంతో కీలకంగా మారనుంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more