రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అని తెలుగు లో ఓ సామెత ఉంది. అంటే సకల అధికారాలను కలిగిన వాడు తలిస్తే ఏమైనా సాధ్యమవుతుందని అర్థం. అయితే తాజాగా మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగదారులు వెతికే పనిలో పడింది. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు మోదీ సర్కర్ కు ప్రతిపక్షాలు చుక్కలు చూపుతున్నాయి. దాంతో తమకు కావలసిన నిర్ణయాలను అమలు చెయ్యడానికి దొడ్డి దారులు, దొంగ దారులను వెతికింది. భూసేకరణ చట్టం చెయ్యాలని ఎంతో ముమ్మరంగా ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్ కు రాజ్యసభలో ఎదురు దెబ్బ తగులుతోంది.
భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీకి సిఫారసు చేసింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటం, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో దారి లేకుండా పోయింది. డిసెంబర్ 31న జారీ చేసిన భూసేకరణల ఆర్డినెన్స్ కాలపరిమితి ఏప్రిల్ 5తో ముగియనుంది. భూసేకరణ బిల్లును తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ ఆమోదించింది. కానీ ఆ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒక సభను ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్ను తిరిగి జారీ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. అందుకే రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. అయినా లోక్ సభలో క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే పక్షం, రాజ్యసభలో మాత్రం మెజారిటీ లేకపోవడంతో భూసేకరణ బిల్లుకు అడ్డుకట్టపడింది. అయితే ఈ బిల్లుకు అన్ని పక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎన్ని సార్లు ప్రతిపక్షాలను వేడుకున్నా లాభం లేకుండా పోయింది. దాంతో ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ కు మొగ్గుచూపుతోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more