గత లోక్సభ ఎన్నికల్లో తాము చేసిన ఖర్చులకు సంబంధించిన స్టేట్మెంట్లను దాఖలు చేయలేదు. దాంతో ఎన్నికల కమిషన్ ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఆరు రాజకీయ పార్టీలకు గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఖర్చులకు సంబంధించి స్టేట్మెంట్లు దాఖలు చేయడానికి 20 రోజుల చివరి అవకాశం ఇచ్చిన ఇసి నిబంధనలు పాటించనందుకు ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వులోని 16(ఎ) సెక్షన్లోని నిబంధనల కింద, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేస్తామంటూ పార్టీలకు హెచ్చరిక చేసింది. ఈ రోజు ఇసి నోటీసులు జారీ చేసిన పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్, జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం) కేరళ కాంగ్రెస్ (మణివర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ మణిపూర్, హర్యానా జనహిత్ కాంగ్రెస్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇంతకుముందు జారీ చేసిన రెండు నోటీసులకు పార్టీలు స్పందించకపోవడంతో ఇసి ఈ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు 90 రోజుల్లోగా ఎన్నికల కమీషన్ కు ఖర్చులకు సంబంధించిన స్టేట్మెంట్లను దాఖలు చేయాలి. కానీ కొన్ని పార్టీలు మాత్రం ఇంకా లెక్కలు చూపని కారణంగా ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఎన్నికల కమీషన్ కు ఇప్పటికైనా ఆ పార్టీలు లెక్కల వివరాలు ఇస్తాయో లేదో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more