రాజధాని లేని రాష్ట్రాన్ని అదుకునేందుక కేంద్రం ముందుకోచ్చింది. కేంద్ర బడ్జెట్ లో తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని గత కొంత కాలంగా ఏకరుపు పెడుతున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ మేరకు కేంద్రంతో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ కు 3 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామి లభించింది.
ఈ మేరకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో సంభాషించినట్లు సమాచారం వెయ్యి కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణంలో కోసం కేటాయించనుండగా, మరో వెయ్యి కోట్ల రూపాయలను జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్రబడ్జెట్ లో పోలవరం నిర్మాణానికి కేటాయించిన 100 కోట్ల రూపాయలకు అదనంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. మరో వెయ్యి కోట్లను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం కేటాయించనున్నట్లు సమాచారం. కాగా ఈ మొత్తం నిధులను ఈ నెల 31 లోపే కేటాయిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్టీ.. చంద్రబాబుకు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసం మరిన్ని నిధులను విధిల్చేందుకు కూడా కేంద్రం సిద్దంగా వుందన్నారు. రాజధాని నిర్మాణంపై వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను పరిశీలించిన మీదట తాము ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులను కేటాయిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన హేతుబద్దంగా కాకుండా ఇష్టానుసారం విభజించి.. కాంగ్రెస్ మోసంగించిందని, అదే సమయంలో కేంద్ర నిధులపై గంపెడాశ పెట్టుకున్నా.. కేంద్రం కనుకరించకపోవడం.. శోచనీయమని, చంద్రబాబు కేంద్రంపై పరోక్ష విమర్శలు చేసిన రోజునే కేంద్రం సానుకూలంగా స్పందించడం గమనార్హం.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more