తెలంగాణ రాష్ట్రంలో అధికార పెత్తనమంతా కేసీఆర్ కుటుంబానిదే అంటు తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నిజానికి తెలంగాణ సాధనలో టీఆర్ఎస్కు రూపాయి భాగస్వామ్యం కూడా లేదు. లోక్సభలో విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ సభలో లేడు. రాజ్యసభలో వారికి ప్రాతినిధ్యమే లేదు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని ఆయన వివరించారు. టీఆర్ఎస్ ఎన్ని ధర్నాలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు. కానీ, అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ను నాశనం చేయాలని, క్షేత్రస్థాయిలో దెబ్బ తీయాలని టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకి చెందిన వారిని బెదిరిస్తూ, లేదంటే డబ్బులతో ప్రలోభ పెడుతూ తెరాస పార్టీలోకి చేర్చుకుంటోందని అన్నారు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్ సిగ్గులేకుండా వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని రెండు కోట్ల మంది మహిళల్లో మంత్రి పదవి చేపట్టడానికి ఒక్కరు కూడా సమర్థురాలు దొరకలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో 15 శాతం వరకూ ఉన్న ఎస్సీల్లోని మదిగ, మాల కులస్తుల్లో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని తప్పుబట్టారు. నిజానికి కాంగ్రెస్ వల్లే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఏ ఒక్క కులానికి పెత్తనం ఉండదు. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీల్లో ఒక్క కుటుంబానిది, ఒక్క కులానిదే పెత్తనమంతా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్నాడు. రాష్ట్రంలో 50-60 లక్షల మంది దళితులు ఉంటే కేవలం 45 మందికే గోల్కొండ కోటలో పట్టాలు ఇచ్చాడు. గిరిజన ఎమ్మెల్యే రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినప్పుడు గిరిజనులకు కూడా మూడెకరాల భూమి ఇస్తామన్నాడు. కానీ.. ఆ ఊసే లేదు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్నాడు. గవర్నర్ ప్రసంగంలో మాత్రం జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పించారని కెసిఆర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more