Pawankalyan tour in ap capital city area is grand sucess

pawankalyan, janasena, undavalli, capitalcity, land pooling, yerrabalem,

pawankalyan tour in undavalley, yerrabalem: janasena president pawankalyan tour to undavalli, commence grandly. pawankalyan listen the problems of the capital city villages problems. pawan warn to govt to not to force the farmers to give land.

కర్షకుల కన్నీరుతో కడతారా..రాజధాని? పవన్ కళ్యాణ్

Posted: 03/05/2015 01:57 PM IST
Pawankalyan tour in ap capital city area is grand sucess

రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని పవన్ కళ్యాన్ హెచ్చరించారు. రాజధానికి ఎనిమిది వేల ఎకరాలు సరిపోతుందని తాను అనుకుంటున్నారని, ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని అన్నారు.  రైతులు కన్నీరు పెడితే సింగపూర్ తరహా రాజధాని అవసరమా అని ప్రశ్నించారు. నేనూ రైతు కుటుంబం నుండే వచ్చాను,నేను కూరగాయలు పండిస్తానని తెలిపారు. తమ భూములు ఇవ్వాలని కొందరు బెదిరిస్తున్నారని మహిళా రైతులు పవన్ కు చెప్పుకున్నారు. మా పిల్లలను ఎలా పోషించుకోవాలని రైతులు పవన్ తో అన్నారు. భూములు లాక్కుంటే అప్పులు ఎలా తీర్చాలని, మా పిల్లలను ఎలా చదివించాలని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ తన కాలేజిలను ఇచ్చేస్తే తమ భూములను ఇస్తామని ఓ రైతు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరమో అంతే తీసుకోవాలని ఒక్క ఎకరం కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదని పవన్ స్పష్టం చేశారు. భూములు లాక్కుంటారనే భయం వద్దని, సమస్య తీరేదాకా మీకు తోడుంటానని అన్నారు.రైతులు సంతోషంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తే ఫర్వాలేదని, కానీ వారికి కన్నీరు పెట్టిస్తు భూములను లాక్కుంటే మాత్రం ఊరుకోనని అన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు. వైయస్ హయాంలో ఇష్టారాజ్యంగా భూములు అమ్మేశారని విమర్శించారు. ఓ రైతు తెచ్చిన టవల్ తో పవన్ ముఖాన్ని తుడుచుకోవడం, మహిళా రైతు తీసుకువచ్చిన భోజానాన్ని తీసుకోవడం లాంటి ఘటనలు పవన్ యాత్రలో మరింత అభిమాన్ని సంపాదించిపెట్టాయి.

paw01
paw02
paw03
paw04
paw05
paw06

జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా,ఆడ ,మగ బేధం లేకుండా తరలివచ్చారు. కొందరు మహిళలైతే ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీ పడ్డారు. ఒక వృద్ద మహిళ అయితే పవన్ చేతిపై ముద్దుపెట్టి, ఆ తర్వాత దగ్గరకు తీసుకుని నుదుట కూడా ముద్దు పెట్టారు.పవన్ పర్యటనలో ఎంతో ప్రేమాభిమానాలు కనిపించాయి. తమ బాధను తీర్చే నాయకుడు వచ్చాడని వారు అతనికి సాదర స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు ఇస్తూ కొందరు,కేరింతలు కొడుతూ కొందరు స్వాగతం చెప్పారు. ఎర్రబాలెం రైతుల అభిమానాన్ని పవన్ కళ్యాణ్ పొందినట్లే కనిపించింది. చివరిలో పవన్ మాట్లాడుతూ రైతుల కంట తడి పెడితే దేశానికి మంచిది కాదని అన్నారు.భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకుంటే ఒప్పుకోనని అన్నారు. రైతులతో మాట్లాడేందుకు నేల మీదే కూర్చున్నారు పవన్ కళ్యాణ్. తమ కోసం తమ నేత వచ్చాడంటూ కొందరు యువకులు భావోద్వేగానికి లోనయ్యారు. మహిళలు, రైతులు తమ బాధను పవన్ కళ్యాణ్ ముందు చెప్పుకున్నారు. జనాల వద్దకు చేరిన జనసేత పవన్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. రైతులతో మాట్లాడిన వపన్ ఓ రైతు తీసుకువచ్చిన భోజనాన్ని తిన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawankalyan  janasena  undavalli  capitalcity  land pooling  yerrabalem  

Other Articles