దేశవ్యాప్తంగా తాజా సంచనానికి కారణమైన నిర్భయ నిందితుడి ఇంటర్వూ వివాదం కొత్త మలుపు తిరిగింది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డ నేపథ్యంలో ప్రభుత్వం డాక్యుమెంటరీని అడ్డుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ఓ ప్రకటన చేశారు. నిర్భయ నిందుతుడి ఇంటర్వూను ఎట్టి పరిస్థితిలోనూ ప్రసారం కానివ్వం అంటూ ప్రకటించారు. మరో పక్క ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై కోర్టు కూడా తీర్పును వెల్లడించింది. ఈ డాక్యుమెంటరీని ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది.
నిర్భయ హంతకుడు ముఖేష్తో జరిపిన వివాదాస్పద ఇంటర్వ్యూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవద్దని భారత్ చాలా గట్టిగా కోరినప్పటికీ బిబిసి పట్టించుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయాలని బిబిసి భావించింది. అయితే, భారత్తో చెలరేగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బుధవారం రాత్రి పది గంటలకు దీన్ని ప్రసారం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. అత్యంత శక్తివంతమైన ఈ డాక్యుమెంటరీని ముందుగానే చూసే అవకాశం ప్రేక్షకులకు కల్పిస్తున్నామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. యూకెలో బిబిసి-4లో దీన్ని ప్రసారం చేస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. బాధిత నిర్భయ తల్లిదండ్రుల పూర్తి సహకారం, మద్దతుతోనే డాక్యుమెంటరీని రూపొందించినట్టు వివరించింది. సునిశితమైన ఈ అంశాన్ని అంతే బాధ్యతాయుతంగా చేపట్టామని, నిబంధనలకు అనుగుణంగానే తమ డాక్యుమెంటరీ ఉందని వెల్లడించింది. అయితే డాక్యుమెంటరీని అడ్డుకోవాలని నిరసనలు కూడా ఎక్కువ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి ఏర్పడుతోంది. మొత్తానికి బిబిసి ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేస్తుందా లేదా అని ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more