పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పార్టీని స్థాపించి తెలుగు గడ్డపై మరో పార్టీకి పురుడు పోశారు పవన్ కళ్యాణ్. సినిమాలో ఎప్పుడూ సామానికి కోణాన్ని ప్రతిబింబించే పవన్, నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాలకు ముందుంటారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించి, తరువాత పార్టీ సంక్షోభంతో కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తరువాత చాలా రోజుల తర్వాత రాజకీయాల వల్లే ప్రజలకు సేవ చెయ్యవచ్చని నమ్మి, జనసేన పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ప్రారంభ ఉపన్యాసం నుండే తాను అందరిలా కాదు అని చెప్పారు. ప్రజల పట్ల తనకున్న కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అన్ని పార్టీల్లాగా ఎదుటి వారిపై ఎప్పుడూ దుమ్మెత్తి పొయ్యడం ఆపి, ప్రజా సంక్షేమాన్ని గురించి ఎప్పుడూ మదనపడుతుంటారు పవన్ కళ్యాణ్.
తాజాగా ఏపి రాజధాని నిర్మాణానికి గాను ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు సంబందించి, రైతులు, గ్రామస్తుల నుండి వస్తున్న వినతులపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తానే స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తూళ్లూరులో పర్యటన జరపనున్నారు. ఉదయం 7గంటల 30నిమిషాలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి గన్నవరం బయలుదేరారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఉండవల్లి, బేతపూడి, ఎర్రబాలెం, తూళ్లూరులో పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. అందులో భాగంగా పవన్ ప్రజలతో మమేకం కావడానికి సిద్దంగా ఉన్నారు. అయితే పార్టీని స్థాపించిన తరువాత మొదటిసారి తలపెట్టిన ప్రజాయాత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజధాని నిర్మాణం వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులుపై ప్రజల నుండి విన్నపాలు స్వీకరించనున్నారు పవన్. గతంలోనే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి ఎలాంటి నిధులు రాకపోవడంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపికి అన్ని రకాలుగా న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో మోదీతో ఎంతో సన్నిహితంగా మెలిగిన పవన్ తమ సమస్యలకు పరిష్కారం చూపుతారని రాజధాని గ్రామాల్లోని ప్రజలు నమ్ముతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more