రాజు తలచుకుంటే దెబ్బలకు కోదవా అన్న సామెత ఇక్కడ గుర్తుకు రాక తప్పదు. అధికారంలో వున్న పాలకులు తలచుకుంటే జరగనిదేముంది. అందుకు అక్షర సత్యంగా నిలుస్తున్న ఈ ఘటనే నిదర్శనం. ములాయం సింగ్ తెలుసుకదండీ, సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడు. ఆయన మనవడు, ప్రస్తుత యూపీలోని మెయిన్ పూరి పార్లమెంట్ సభ్యుడు అయిన తేజ్ ప్రతాప్ సింగ్ వివాహం బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనిష్ట పుత్రిక రాజ్ లక్ష్మీతో కుదిరిన విషయం తెలిసిందే. ఈ నెల 26న వారిరువురి పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించనున్నారు.
అయితే వివాహ మహోత్సవానికి ముందు ములాయం సింగ్ ఇంటి ఆచారాల ప్రకారం తిలకం దిద్దే కార్యక్రమం ఉంటుంది. ఇందుకు కూడా అతిధులను పిలుస్తారట. కాగా, ఈ నెల 21న జరగనున్న తిలకం దిద్దటానికే లక్ష మంది అతిధులను ములాయం సింగ్ ఆహ్వనించారట. ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాహ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో వున్న సైఫై గ్రామాంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను కూడా ములాయం ఆహ్వానించారట. ఈ కార్యక్రమానికి ప్రధాని వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని భద్రతకు సంబంధించి, ఆయన ప్రత్యేక రక్షణ ధళం సభ్యులు భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రధాని హెలికాఫ్టర్ దిగే హెలిఫ్యాడ్ ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం.
శనివారం సైఫై గ్రామం మునుపెన్నడూ ఎరుగని అతిధులకు ఆహ్వానం పలకనుంది. తిలకం దిద్దే వేడుక నేపత్యంలో వచ్చే అతిధులకోసం బిదాయ్, బాటీ చోఖా, హల్వా వంటి రుచికరమైన వంటకాలను కూడా సిద్దం చేస్తున్నారట. వీరితో పాటు బాలీవుడ్ తారలు, గాయకులు, రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్ర, రాష్ట్రేతర రాజకీయ నేతల రాకతో గ్రామం కోత్త కాంతులీననుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more