టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ భార్య లావణ్యకు ఇటీవలే ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన తాజా మూవీకి సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై పని చేసుకుంటుంటే.. అనవసరంగా అందులో ఓ పోలీస్ అధికారి దూరాడు. అంతేకాదు.. ఆమెతో దురుసుగా కూడా ప్రవర్తించాడు. ఓ పోలీస్ తనతో అలా ప్రవర్తించడంపై తీవ్ర అసంతృప్తికి గురైన లావణ్య.. అతనిపై ఫిర్యాదు చేసింది. అంతే! పై అధికారులు అతడిపై వేటు వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పూరీ కుమారుడు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే! ఆ మూవీ కోసం పూరీ భార్య లావణ్య పాల్వంచ ప్రాంతానికి వెళ్లారు. షూటింగ్ అక్కడే జరుగుతున్నందున ఆమె చిత్ర యూనిట్ తో కలిసి ఓ హోటల్ లో బస చేశారు. ఆమె బస చేసిన గదిలో ఆమెతోపాటు చిత్ర హీరోయిన్, ఇతర జూనియర్ నటీనటులు కూడా వున్నారు. తమ చిత్రానికి సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పాల్వంచ ఎస్ఐ షణ్ముగాచారి ఈనెల 11వ తేదీన లావణ్య బస చేసిన హోటల్ ను పరిశీలించారు. ఆ హోటల్ లో అన్ని గదులను ఆ ఎస్ఐ తనిఖీ చేస్తూ.. లావణ్య వుంటున్న రూంను కూడా పరిశీలించారు. అప్పుడు ఆమె తనగురించి, యూనిట్ గురించి ఆ ఎస్ఐకి తెలిపినప్పటికీ.. ఆయన మాత్రం ఐడీ కార్డులు చూపాలంటూ కటువుగా మాట్లాడారు. అంతేకాదు గదిలోని బాత్ రూంను కూడా తనిఖీ చేశారు.
ఎస్ఐ షణ్ముగాచారి ఆ విధంగా తనిఖీ చేయడంతో ఇబ్బందిపడ్డ లావణ్య.. ఈ మొత్తం తతంగాన్ని భర్త పూరీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పూరీ.. వెంటనే డీజీపీ, కొత్తగూడెం డీఎస్పీకి ఫోన్ లో ఫిర్యాదు చేశారు. ఇతనిచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఎస్ఐ షణ్ముగాచారి, పూరీభార్య లావణ్యతో దురుసుగా ప్రవర్తించారని నిర్థారించారు. దీంతో ఆయన్ను పాల్వంచ పీఎష్ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఇంకా ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఖరారు చేయలేదని సమాచారం!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more