చిన్న జబ్బు చేసినా మందులు ఇవ్వండి ఇంటి దగ్గర వాడతాం అంటూ ఉంటాం.అంతే కానీ ఆస్పత్రిలో చేరడానిక మాత్రం ఇష్టపడం. కొంత మందికి అసలు ఆస్పత్రిలో వాసనంటేనే పడదు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం నేను ఆస్పత్రి నుండి బయటకు రానంటే రాను అని భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు కోర్టులో కేసు వేసి ఆ ఆస్పత్రి యాజమాన్యం అతన్ని తమ హాస్పిటల్ నుండి వెళ్లగొట్టింది. పోలీసులు ఆ వ్యక్తిని తీసుకెళ్లేటపుడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడట. ఇంతకీ ఎందుకతను అలా అంటున్నాడో ఎవరికీ తెలియదు. చైనాలో జరిగిన సంఘటన పూర్తి వివరాలతో ఈ కథనం...
చైనాలోని బీజింగ్ జిల్లాలోని మొంటావ్ గ్రామానికి చెందిన చెన్ అనే వ్యక్తి 2011 ఆగష్టులో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దాంతో అతను బీజింగ్ జింగ్మీ గ్రూప్ ఆస్పత్రిలో చేరారు.
నెల రోజుల తర్వాత గాయాలు పూర్తిగా తగ్గాయని తేల్చిన వైద్యులు అతన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. చెన్ మళ్లీ రెండు నెలల తర్వాత ఎడమ కాలులో నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతని ఎడమకాలి రక్తనాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకుపోవడాన్ని గుర్తించారు. దాదాపు మూడు నెలలు వైద్యం అందించిన అక్కడి వైద్యులు అతన్ని పూర్తి ఆరోగ్యంగా మార్చారు. కానీ ఆస్పత్రి నుండి తాను వెళ్లేది లేదని అక్కడే కూర్చున్నాడు. కొన్నాళ్లకు అతను ఆస్పత్రి బిల్లు కూడా కట్టడం మానేశాడు. దాంతో 2012 జూలై నుంచి ఆతనికి వైద్య సేవలను కూడా నిలిపేశారు ఆస్పత్రి సిబ్బంది. అయినా సరే తాను మాత్రం ఆస్పత్రి నుండి కదలేది లేదని కూర్చున్నాడు. చివరకు తన స్వంత కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకు వెళ్లింది. అయితే చెన్ ఏమైనా మానసిన వ్యాధితో బాధ పడుతున్నారా అన్న సందేహంతో అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. చెన్ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. మొత్తానికి కోర్టు జోక్యంతో పోలీసులు వచ్చి చెన్ ను బలవంతంగా ఆస్పత్రి నుండి ఇంటికి తరలించారు. పాపం చెన్ మాత్రం చంటి పిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చేశాడట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more