సభ్య సమాజం తలదించుకునేలా తన సహచర ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ మధ్య వయస్కుడైన వ్యాపారవేత్తకు ఆ మహిళ తగిన రీతిలో స్పందించి మంచి గుణపాఠాన్ని నేర్పింది. సరిగ్గా విమానం లాండ్ అయని క్షణంలో ఆమె చేసిన పనికి సదరు వ్యాపారవేత్త సిగ్గుతో తలదించుకున్నాడు. అంతేకాదు లైంగిక వేదింపులకు పాల్పడితే ఎలా వుంటుందో కూడా రుచిచూపించే విధంగా వీడియోను తీసి యూట్యూబ్ లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో సామాజిక వైబ్ సైట్లలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి భువనేశ్వర్ కు బయలుదేరి వెళ్తున్న విమానం గగనతలంలో వుండగా తన వెనక కూర్చున్న వ్యక్తి చేతులు ఆ మహిళకు తగిలాయి. విమానం సీటు సందులోంచి చేతులు తగలడంతో పొరబాటున వెనుక కూర్చున్న వ్యక్తి తగిలించాడనుకుని నిమ్మకుండింది ఆ మహిళ. అంతలో మరోమారు మళ్లీ తగిలాయి. దీంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని గమనించి మహిళ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపింది. అయినా మళ్లీ అదే చర్య. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని వెకిలిచేష్టలను వీడియో తీసింది. సరిగా విమానం లాండ్ అవుతున్న సమయంలో బిగ్గరగా కేకలు వేసింది.
అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళకు అండగా నిలిచారు. తోటివారి సహాయంతో ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే మహిళలు ప్రతిఘటించడానికి భయపడతారు. కానీ అలా చేయడం కూడా నేరం అనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొంది. తన విషయానికి వస్తే చట్టాలు ఏం చేయలేవని తెలిసి, అందరి ముందు అతడిని అవమానం జరగాలని భావించి గట్టిగా అరిచానని' యువతి తెలిపింది. కాగా సదరు 'పెద్ద' మనిషి భువనేశ్వర్కు చెందిన పలు కంపెనీలకు ఛైర్మన్. అయితే జున్జున్వాలా పోలీసులు మాత్రం అతడిని కొద్దిసేపు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more