అణువణువునా మతచాందసం నింపుకున్నఉగ్రవాదులు తమ గమ్యం ఏమిటో మర్చిపోయారు. తమ మతమే గొప్పదని.. అదే ప్రపంచ వ్యాప్తంగా బాసిల్లాని కొరుకోవడంలో తప్పులేదు.. కానీ మతం పేరున మారణహోమాన్ని సృష్టించడం, మతం మాటున విధ్వంస రచన చేయడం సహేతుకం కాదు. ఇన్నాళ్లు ప్రభుత్వాలు, తమ వ్యతిరేకులను టార్గెట్ చేసిన ముష్కరులు.. దేని కోసం పోరాడుతున్నామన్న లక్ష్యాన్ని మర్చిపోయారా..? తమను విమర్శించే ప్రతి వారిని టార్గెట్ చేస్తామంటూ పరోక్ష సంకేతాలను ప్రపంచానికి అందిస్తున్నారా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
తమ ప్రబాల్యం అధికంగా వున్న చోట మాత్రమే అక్కడి పాలక పక్షాలు, ప్రభుత్వాలపై ఎదురొడ్డి పోరాడుతున్న ఉగ్రవాదులు.. మిగతా ప్రపంచ దేశాలలో తమ ఉనికి చాటుకునేందుకు అకస్మిక దాడులకు పాల్పడుతున్నారు. మరి కోన్ని చోట్ల బాంబు దాడులు.. వారు పోరాడుతున్న లక్ష్యం వెనుక సదుద్దేశ్యమే వుంటే ప్రబుత్వానికి ఎదురొ్డి పోరాటం చేయలేరా..? కానీ అలా కాకుండా ఆయుధాలు చేతబట్టి ప్రజల ప్రాణాలను హరించడమే లక్ష్యంగా ఎందుకు మారుతున్నారు.
ఇప్పుడు తాజాగా ప్రపంచవ్యాప్తంగా మీడియాపై ఉగ్రవాదులు మరణశాసనాన్ని లిఖించారు. తమకు వ్యతిరేక కథనాలను రచిస్తున్నారన్న అక్కస్సును వెళ్లగక్కి పారిస్ లోని చార్లీ హెబ్డో అనే వ్యంగ వార పత్రికపై దాడి చేసిన బీభత్సం సృష్టించారు. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయ సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఉగ్రవాదులు ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయారు.
నిజంగా అల్లా ఇది సహిస్తాడా..? తన పేరున మారణహోమం చేస్తున్నవారిని క్షమిస్తాడా..? 12 మంది కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అంతుచిక్కని వైరస్ ఎబోలా కబళిస్తున్న ప్రాణాల కన్నా అధికంగా ముష్కరులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. ఏ దైవమైనా.. ఏ రూపంలోవున్నా ఒకరిని హతమర్చామని ఎన్నడూ చెప్పదు. ఏ గంద్రంలోనూ అలా అని లిఖించనూ లేదు. విశ్వవ్యాప్తంగా తమ మతమే ప్రజ్వలించేలా చూడాలని కూడా ఏ మతగ్రంధాలు భోధించవు. కులాలు మతాలు అన్ని మనుషలు ఏర్పర్చుకున్న పరుధులే తప్ప.. మరోకటి కాదు. అయినా మతం పేరిట మారణహోమాలను సృష్టించి సామాన్య మానవులను భయకంపితులను చేయడం ఎందుకు..?
ఈ ఘటనతో ముష్కరులు ప్రపంచానికి తెలిపిందేమిటి..? వ్యతిరేక కథనాలు ప్రచురిస్తే.. దాడులు చేస్తామనా..? దీంతో ఒక పత్రికపై ప్రతీకారం తీర్చుకున్నారు ముష్కరులు. కానీ ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కాయి. దారుణ మారణకాండను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచలోని అన్ని మీడియా సంస్థలపైనా ఉగ్రవాదులు దాడులు చేస్తారా..? ముష్కరులకు వ్యతిరేకంగా కథనాలను రాయకుండా అడ్డుకుంటారా..? అదే సాధ్యమేనా..? ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా వున్న మీడియాను కట్టడి చేయడంలో వారు పై చేయి సాధించగలరా..? వారే పునరాలోచించుకోవాలి.
మంచిని మంచిగానే చూపుతూ.. ప్రపంచ దేశాలకు మార్గనిర్ధేశకం చేస్తుంది మీడియా. మీడియా అంటే అది ఏ రూపంలో వున్నా.. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ పోర్టల్, వార పత్రికలు, మ్యాగజైన్ ఏదైనా సరే వారు ఎలుగెత్తి చాటేది నిజాన్నే. పలు సందర్భాల్లో మీడియా మంచిలోని చెడు కూడా ప్రచురిస్తుంది..? ప్రశ్నిస్తుంది..? దానిని అదే స్థాయిలో ఎదుర్కోన్నేందుకు ప్రయత్నించాలి తప్ప.. ఇలా దాడులు చేసి.. మీడియానే అంతం చేస్తామని భ్రమిస్తే.. అది అరచేతితో సూర్యడిని అపినట్లేనని ముష్కరులు గ్రహించాలి. అనేక మంది రాజకీయ నేతల తప్పులను, అక్రమాలను భయపెట్టిన మీడియా జంకితే.. ఇక మీడియా అనేందుకు అర్థమేముంటుంది. అయినా న్యూటన్ మూడో లా ప్రకారం బంతిని ఎంత వేగంగా విసిరతే.. అంతే వేగంగా వెనక్కు వస్తుందన్న నిజాన్ని కూడా ఉగ్రవాదులు గమనించాలి. పారిస్ లోని చార్లీ హెబ్డో వార్త పత్రికపై జరిగిన దాడితో ప్రపంచ మీడియా అంతా ఏకమైంది.
భయపెట్టి, అంధోళనకు గురిచేసి తమ ఆదిపత్యాన్ని కొనసాగించాలన్నదే ముష్కరుల లక్ష్యమా..? అంటే అలానే కనిపిస్తుంది. దారాణాలకు, దురాగతాలకు పాల్పడుతూ.. ప్రజలను భయాందోళను గురిచేసిన నియంతలందరూ కాలగర్భంలో కలిసారు. వారి చరిత్రలను చూసైనా.. అణిచివేసిన కొద్ది తిరుగుబాటు అధికమవుతుందన్న విషయాన్ని ముష్కరులు తెలుసుకోవాలి. అంతేకాదు.. వ్యతిరేకులని ముద్రవేసి ప్రజలను ఒక్కొక్కరిగా హరిస్తే.. చివరకు మిగిలేది స్మశానమే. ఇక మిగిలిన వారు కాటి కాపరులే. దీంతో ఏదో సాధిద్దామనుకుంటున్న వారి లక్ష్యం కూడా తీరదు.
అదే సమయంలో నియంతలకు, రాచరిక పాలనకు ఎదురోడ్డి ఒంటరిగా విజేతలుగా నిలుస్తారని వషయాన్ని ముష్కరులు తెలుసుకోవాలి. లక్ష్యం మంచిదైనా, కాకపోయినా.. పోరాటం చేస్తున్న మార్గాన్ని అన్వయించే వాటి ఫలితాలు వుంటాయి. దుర్మార్గం ద్వారా తాత్కలిక ఫలితాలతో ఆనందం పోందుతున్న ముష్కరులు.. అది కొద్ది కాలమే నిలుస్తుందన్న సత్యాన్ని కూడా గ్రహించాలి. సన్మార్గంలో వెళ్తే.. విజయం చివరగా వరించినా.. అది శాశ్వతంగా నిలుస్తుందన్న విజయాన్ని తెలుసుకోవాలి.
ఇందుకు మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న అంగ్ సాంగ్ సూకీ.. పోరాటం గురించి ప్రపంచ దేశాలకు తెలుసు. మొక్కవోని ధైర్యంతో అమె తీసుకుంటున్న నిర్ణయాలకు ఖంగుతిన్న అక్కడి రాచరికం పెద్దలు అమెను గృహ నిర్భంధం చేసినా.. అమె తన పోరాటాన్ని విడనాడలేదు. ఈ క్రమంలో తన భర్తను కూడా కొల్పోయినా.. తన లక్ష్యం పెద్దదిగా భావించిన సూకీ.. లక్ష్యసాధన కోసం నిలబడ్డారు. ప్రస్తుతం గమ్యానికి చేరువలో వుంది. తాను స్థాపించిన ప్రజాస్వామ పార్టీ తరపున ఎంపీగా, ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
మూడు శతాబ్దాల పాటు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాగించిన నియంతృత్వ పాలన నుంచి భారతీయులు చేపట్టిన అహింసా మార్గమే.. ఉపఖండంగా బాసిల్లుతున్న భారత్ దేశానికి స్వాతంత్ర్యాని అందజేసిందని.. జాతిపిత గాంధీజీ ఎంచుకన్న శాంతియుత విధానం వారి ఓర్పు, సహనాల నుంచి కూడా ముష్కరులు అనేక విషయాలను నేర్చుకోవాలి. ఆయుధ బాట వీడి సన్మార్గంలో.. శాశ్వత పద్దతిలో తమ విజయాలను నమోదు చేసుకోవాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more