పైలెట్ అప్రమత్తత వారందరినీ సురక్షితంగా వారివారి గమ్యస్తానాలకు చేర్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 103 మంది ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా క్షేమంగా వారిని తీసుకోచ్చాడు ఓ పైలెట్. అతని ముందు జాగ్రత్తే వారిని ప్రమాదపుంటునుంచి కాపాడింది. అయితే ఇందుకు ఆ పైలట్ తన విదులను సక్రమంగా నిర్వహించడం తప్ప మరోకటి చేయలేదు. నిజమే పైలట్ శిక్షణను పొందే క్రమంలో వారిని పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగానే వారు విమానం పరిస్థిని కాస్త ముందుగానే అంచనా వేస్తారు. ఎందుకంటే నిత్యం గగన వీధుల్లో తిరిగే విహాంగాలను ఎక్కడపడితే అక్కడ నిలపి మరమ్మత్తులు చేసుకోలేరు కాబట్టి. అయితే ప్రయాణికుల ప్రమాదం బారిన పడకుంబా జగ్రత్తాగా వ్యవహరించాడు ఓ పైలట్.. అదెలా అంటారా..?
103 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళూరు నుంచి ముంబాయి మీదుగా న్యూఢిల్లీ బయలుదేరిన వెళ్లాల్సిన విమానం రెక్కల్లో పగుళ్లు ఏర్పడినట్లు విమాన పైలట్ గుర్తించి.... మంగళూరు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో దింపివేశారు. న్యూఢిల్లీ నుంచి సాంకేతిక సిబ్బందిని రప్పించి... విమానంలో ఏర్పడిన లోపాన్ని సరి చేశారు. ఈలోగా ముంబాయి చేరుకోవాల్సిన ప్రయాణికులను ఇతర విమాన సర్వీసుల ద్వారా పంపించారు. మరమ్మతులు చేసిన అనంతరం ఢిల్లీకి చేరుకోవాల్సిన 47 మంది ప్రయాణికులను ఆ విమానం న్యూఢిల్లీ తీసుకెళ్లింది. విమానాల్లో సెల్ఫీలకు పోజులిస్తూ పట్టుబడిన ఎందరో పైలెట్ లను మనం చూశాం. వారిలా కాకుండా అప్రమత్తతతో, బాద్యతాయుతంగా విదులు నిర్వహించే వారిని మనం ప్రశంసించాల్సిందే.
జి.మనోమర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more