ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టిలో పడాలని తహ తహ లాడుతున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉండక కొంత, సరైన సంభంధాలు లేక కొంత తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు సరి కదా కేంద్రం దగ్గర తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పనులు వట్టి నీటి మూటలే కాక తప్పలేదు. అప్పుడు అందుకే కేంద్రం తో సరైన సంబంధాలు నెరపే నాయకుడు కావాలని బిజెపి కి అత్యంత సన్నిహితంగా ఉండే జీతేందర్ రెడ్డి ని కెసిఆర్ తెరాస పార్లమెంటరీ నేత గా ఎంపిక చేశారు. ఇప్పటికి కేంద్రంతో ఏ పని కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జితేందర్ రెడ్డితోనే కొన్ని పనులు చేయించుకుంటూ వచ్చింది.
కాని ఇప్పుడు మాత్రం పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. కేంద్రం లో కెసిఆర్ కు మరియు నరేంద్ర మోడీ కి ఈ మధ్య మంచి సంబంధాలు ఏర్పడటం తో కేంద్రం లో కొన్ని పనులు కొంత సులభంగా జరిగిపోతున్నట్లు తెలుస్తుంది., తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య,ప్రత్యేకించి టిఆర్ఎస్ నాయకత్వానికి, కేంద్రంలోని బిజెపి నాయకత్వానికి మధ్య కొంత సత్సంబంధాలు ఏర్పడినట్లే కనిపిస్తుంది. తెలంగాణ శకటానికి కేంద్రం అనుమతించడం ఒక నిదర్శనమైతే, ముఖ్యమంత్రి కెసిఆర్ కోరినట్లు ఎపి ఎక్స్ ప్రెస్ రైలు పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చడానికి కూడా కేంద్రం అంగీకరించింది.
కాని ఈ మధ్య తెలంగాణా ప్రభుత్వానికి ఒక చిక్కొచ్చి పడింది. లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడు ఎపి జితేందర్ రెడ్డి తెలంగాణ శకటం కోసం గట్టి ప్రయత్నం చేశారు. ఎపికి రిపబ్లిడ్ డే ప్రదర్శనలో అనుమతి ఇచ్చి, తెలంగాణ శకటానికి అనుమతి రాకపోవడం సహజంగానే ఇబ్బందిగా ఉంటుంది.ఈ నేపధ్యంలో జితేందర్ రెడ్డి రక్షణశాఖ మంత్రి పరిక్కర్ ను కలిశారు. అయినా పని జరగకపోవడంతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లిని కలిసి మళ్లీ విజ్ఞప్తి చేశారు. జైట్లి చొరవ తీసుకుని ఫోన్ చేసి ఫరిక్కర్ ను పరిశీలించాలని కోరారు. ఆ మీదట పరిక్కర్ అదికారులతో మాట్లాడి చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంతలో కొంత సంబంధాలు మెరుగుడపడకపోతే, ఒకసారి నో అన్న తర్వాత రిపబ్లిక్ డే శకటాలకు అంత తేలికగా అనుమతులు రావు.ఇది మంచి పరిణామమే!! మొత్తానికి తెలంగాణ శకటానికి అనుమతి ఇవ్వటం పట్ల తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more