ఎపి లో జరుగుతున్న్ రాజధాని నిర్మాణం కోసం అక్కడ చుట్టూ రైతులు సాగు చేసుకుంటున్న పచ్చని పొలాలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా వచ్చే నెలలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక సమావేశం జరగబోతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో చాల మంది మేధావులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. దానిలో సత్య నాదెళ్ళ తండ్రి మాజీ ఐ ఏ ఎస్ అధికారి అయిన బి ఎన్ యుగంధర్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలు ఎందుకు నాశనం చేయాలనీ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీరు ఈ విషయం లో ముఖ్యమంత్రి ని కూడా కలిసినట్లు సమాచారం. ఇందులో మైక్రోసాఫ్ట్ సిఇఓ అయిన సత్య నాదెళ్ళ తండ్రి బి ఎన్ యుగంధర్ కూడా ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
హక్కుల నేతలలో ఒకరైన బి.ఎన్.యుగంధర్ తో పాటు పలువురు రిటైర్డ్ ఐఎఎస్ లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మేధావులు,హక్కుల సంఘాల నేతలు పాల్గొనబోతున్నారు.యుగంధర్ కేంద్రంలో పలు కీలక పదవులలో ఉన్న మాజీ ఐఎఎస్.ఆయన హక్కుల విషయంలో ప్రజల తరపున నిలబడుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సాయినాధ్, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం, మాజీ ఐఎఎస్ లు ఇ.ఎ.ఎస్.శర్మ, దైవ సహాయం, ఆంజనేయరెడ్డి, కె.ఆర్.వేణుగోపాల్ ( పివి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా ఉండేవారు) కూడా ఇందులో బాగస్వామి అవుతున్నారు.కృష్ణా డెల్టా హక్కుల పోరాట కమిటీ కన్వీనర్ గా ఉన్న మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ పంట పొలాలను ప్రభుత్వం తీసుకోవడాన్ని రాజకీయంగాను, చట్టపరంగాను ఎదుర్కుంటామని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ లో కావాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొని,ఎందుకు పొలాలు తీసుకోవలసి వస్తుందో చెప్పి ఒప్పిస్తే తాము భూములు ఇవ్వడానికి సిద్దమని ఆయన అన్నారు.న్యాయపరంగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని మల్లెల చెప్పారు. హైదరాబాద్ లో జరిగే రౌండ్ టేబుల్ కు ఇలాంటి ప్రముఖులు అంతా వస్తే అది దేశం యావత్తును ఆకర్షించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎపి ప్రభుత్వం మరిన్ని విమర్శలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాని ఇందులో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత తండ్రి యుగంధర్ పాల్గొనటం అందరికి ఆసక్తిని కలిగిస్తుంది.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more