సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తి సంరక్షణ ఇప్పిస్తామంటూ ప్రకటించిన బీజేపీ పార్టీ... తన మాట తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకరు ఓ మహిళపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడు. తనను వదిలేయమంటూ ఆ మహిళ ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా.. అతను మాత్ర వదలడం లేదు. ఒకవేళ తనపై పోలీసులకు కంప్లైంట్ చేసినా.. తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందంటూ ఆ మహిళను భయటపెడుతూ వచ్చాడు ఆ నేత! అయితే చివరికి ఏదో ఒక విధంగా తన భయాన్ని పోగొట్టుకుని పోలీసులకు ఆశ్రయించడంతో అతడు పట్టుబడ్డాడు.
గుంటూరు జిల్లాలోని తెనాలిలో వుండే గాజుల వెంకయ్యనాయుడు అనే బిజెపి యువనాయకుడు.. ఓ మహిళకు అసభ్యకరమైన మెస్సేజ్ లు పంపుతూ వచ్చాడు. గతకొన్నినెలల నుంచి అతడు తరుచూ బూతు సందేశాలు పంపుతున్న కారణంగా తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. నకు మెయిల్స్ రూపంలో అసభ్యకర మెస్సేజ్ లను పంపించడంతొపాటు ఫోటోలను కూడా మార్ఫ్ చేసి తనను బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆదివారంనాడు అతనిని తన స్వగ్రామంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం హైదరాబాద్ కు తలరించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా.. గత సంవత్సరం మే నెలలో కూడా ఇతగాడు ఇదే కేసులో అరెస్టయ్యాడు. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం తిరిగి ఆమెను వేధించడం ఆరంభించాడు. దీంతో ఆ వేధింపులు భరించలేని ఆమె గతేడాది అక్టోబర్ లో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ ఎలాగోలా బతికి బయటపడింది. అయినా ఇతడు తరుచూ ఆమెను ఫోటోలు మార్ఫ్ చేసి ఆమెకు పంపించడం, అసభ్యకరమైన సందేశాలు పంపించడం మాత్ర తగ్గలేదు. దీంతో ఇన్నాళ్లవరకు వేగిన సదరు మహిళ.. చివరకు పోలీసులను ఆశ్రయించి అతని ఆట కట్టించింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more