కడప పట్టణంలో ఏడాదిక్రితం అదృశ్యమైన ఐదుగురు కుటుంబసభ్యలు శవాలుగా మారి తేలిన విషయం ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! చివరకు ఈ కేసు వెనకున్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. శాంతిసంఘం జిల్లా అధ్యక్షడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్ ఏడాదిక్రితం భార్య మౌనికతోపాటు తన ముగ్గురు పిల్లలతో కలిసి కనిపించకుండా పోవడంతో... మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లు కంప్లయింట్ అయితే తీసుకున్నారు కానీ.. కేసు మాత్రం నమోదు చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో ఈ కేసు అలా, ఇలా సాగుతూ ఒక సంవత్సరం వరకు కొనసాగింది.
దీంతో ఆమె జిల్లా ఎస్సీని ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కృపాకర్ సన్నిహితులు, ఇతరులను విచారించిన అనంతరం వారందరూ హత్యకు గురైనట్లు తేల్చిన ఆ ప్రత్యేక బృందాలు.. హత్యకు గురైన కృపాకర్ నిర్వహిస్తున్న స్కూల్ గ్రౌండ్ లోనే వారు శవాలు వున్నట్లు తేల్చారు. వీరందరూ హత్యకు గురయ్యారనే విచారణలో తేలింది కానీ.. ఎందుకు హత్య చేయబడ్డారోనన్న విషయం మిస్టరీగానే మిలిగింది. దీంతో తమ విచారణను మరింత వేగవంతం చేసిన పోలీసులు.. చివరకు ఈ మత్య వెనుక వున్న మిస్టరీని ఛేదించగలిగారు.
కృపాకర్ తన భార్య మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతోనే హత్యకు పథకం వేసినట్లు జిల్లా ఎస్పీ నవీన్ చెప్పారు. భర్త కృపాకరే తన భార్య మౌనికతోపాటు ముగ్గురు పిల్లలను హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ హత్య చేయించిన అనంతరం కృపాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న బాధతో కుంగిపోయిన కృపాకర్.. అవమానాన్ని భరించలేక తమ పిల్లలతోపాటు భార్యను కూడా చంపించేశాడని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాలన్నీ కృపాకర్ తండ్రి రాజారత్నానికి ముందే తెలిసినప్పటికీ బయటపెట్టలేదని, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more