ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రతిపక్షాలు మరోసారి విమర్శల పర్వం కొనసాగిస్తున్నాయి. ఏపీ సెక్రటేరియట్ లో బాబు కార్యాలయం ఖర్చుకు చంద్రబాబు ఏకంగా రూ.20కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. మహా అయితే రెండు లేదా మూడేళ్ళపాటు వినియోగించే ఈ కార్యాలయం కోసం ఇంతగా ఖర్చు చేయటం అవసరమా అని విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనంను నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తోంది.
రాష్ర్ట విభజన తర్వాత సచివాలయంను కూడా రెండుగా విభజించారు. ఇందులో భాగంగా ఏపీ సీఎఎం కోసం ముందుగా హెచ్ బ్లాకును ఎంపిక చేశారు. అయితే వాస్తు బాగా లేదని ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దీనిలో భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో ఎల్ బ్లాకులో కార్యాలయం భద్రత కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారు. ఎల్ బ్లాకులోని ఎనమిదవ అంతస్థులో ఉన్న ఆఫీసును బుల్లెట్ ప్రూఫ్ గా మార్చారు. కార్యాలయంలో సకల సౌకర్యాలు కల్పించారు. సీఎం ఛాంబర్ తో పాటు కాన్ఫరెన్స్ హాలు, మంత్రులతో భేటి కోసం మరో హాలు, లాంజ్, సీఎం కార్యదర్శులు, ముఖ్య ర్యదర్శుల కోసం చాంబర్లను రూపొందించారు. వీటన్నిటికి 20కోట్ల మేర ఖర్చయిందని అధికారులు చెప్తున్నారు.
బాబుకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ఇన్ని భద్రతా చర్యలు చేపట్టారు బాగానే ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు ఉండేది ఎంత కాలం అంటే కేవలం రెండు నుంచి మూడేళ్ళు మాత్రమే. విజయవాడలో వారానికి మూడు రోజులు ఉంటాననీ.., అంతేకాకుండా వీలైనంత త్వరలో కార్యాలయాలు ఏపీకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే ఆదేశించింది. ఈ నేపథ్యంలో మూడేళ్ళ తాత్కాలిక కార్యాలయం కోసం ఇంత డబ్బు ఖర్చు అవసరమా అని విమర్శలు వస్తున్నాయి. కార్యాలయం ఎనమిదవ అంతస్థులో ఉండటం వల్ల భద్రతాపరమైన ఇబ్బంది ఉంది. అదే ఒకటవ అంతస్థులో ఉన్నా.., హెచ్ బ్లాకులో ఉన్నా ఇంత ఖర్చు జరిగేది కాదని విమర్శలు వస్తున్నాయి. అయినవారికే తెలియాలి దీనికి కారణం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more