హైదరాబాద్ మెట్రో రైలు ఢిల్లీకి పరుగులు తీసింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలతో పనులు కొనసాగించలేమని గతంలో ప్రకటించిన మెట్రో రైలు నిర్మాణ సంస్థ.. కేంద్రంలో తన పరపతిని వినియోగించి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పుకుంది. హైదరాబాద్ మెట్రో రైలును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు ట్రామ్వే చట్ట పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో రైల్వే భద్రత బోర్డు ఈ ప్రాజెక్టు భద్రతా వ్యవహారాలను పరీక్షించేందుకు నిరాకరిస్తోంది. కేంద్ర చట్టం పరిధిలోకి రానిదే భద్రతా వ్యవహారాలను పరీక్షించబోమని తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైలు తొలిదశ మార్గంపై అధికారికంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు మార్గాల్లో 71.16 కిలోమీటర్ల మేర చేపడుతున్న మెట్రో రైలు పనులను తన పరిధిలోకి కేంద్రం తీసుకోచ్చింది.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గాన్ని కారిడార్-1గా, జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఫలక్నుమా మార్గాన్ని కారిడార్-2గా, నాగోలు నుంచి శిల్పారామం మార్గాన్ని కారిడార్-3గా కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మియాపూర్, ఫలక్నుమా, ఉప్పల్లో డిపోలను నిర్మిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైలును ట్రామ్వే చట్టం పరిధిలోంచి.. కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు చట్టం పరిధిలోకి తీసుకొచ్చినట్లుగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ చట్టం ప్రకారం అలైన్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసినట్లు వెల్లడించింది.
అయితే కేంద్రం జీవో జారీ చేసినప్పటికీ అవసరాలకు అనుగుణంగా మార్గంలో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్ర చట్టం పరిధిలోకి తీసుకురావడంతో భద్రతా పరీక్షలకు మార్గం సుగమమైందని.. భద్రతా పరీక్షలు చేపట్టేందుకు రైల్వే బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మెట్రో రైలు నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు, ఆరోఫణలు, మీడియా కథనాలతో విసిగిపోయిన తెలంగాణ ప్రభుత్వం.. మెట్రో రైలు పనులను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని యోచించినట్టు తెలుస్తోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more