ఏపీ ప్రభుత్వం కొలువుల జాతరను మొదలు పెట్టింది. నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్సీ ద్వారా దాదాపు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు.
ఇక ఎస్.జీ.టి.లో బీ.ఎడ్ అభ్యర్ధులకు అవకాశం ఇస్తామన్న ఎన్నికల హామిపై పరిశీలన జరుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ విషయంపై ఉన్నతస్థాయి అధికారుల బృందం ప్రత్యేకంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. డీఎస్సీకి అభ్యర్ధులంతా సిద్దం కావాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీ.టీ.సీ. విద్యార్థులను అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎస్.జీ.టీ. పోస్టులకు మాత్రం బీ.ఎడ్ అభ్యర్ధులను అనుమతించలేదు. దీని వల్ల టీటీసీ విద్యార్థులకు రెండు అవకాశాలు ఉండగా.., అంతకంటే ఎక్కువ చదివిన బీఎడ్ విద్యార్థులకు మాత్రం అవకాశాలు తక్కువ అయ్యాయి.
దీనిపై ఉమ్మడి రాష్ర్టంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఎన్నికల సమయంలో.., బీఎడ్ విద్యార్థులకు టీటీసీలో కూడా అవకాశం ఇస్తామని టీడీపీ హామిఇచ్చింది. ఆ మేరకు హామి అమలు చేస్తే జరిగే పరిణామాలు.., టీటీసీ విద్యార్థుల సంఖ్య, వారికి ఉద్యోగాల్లో ఏర్పడే కోత వంటి అంశాలపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more