ఫేస్ బుక్ ద్వారా సోషల్ మీడియాలో ఎంత త్వరగా ఎక్కువమందితో సంపర్కాన్ని స్థాపించుకుని ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టవచ్చన్నదే కాకుండా ప్రాణాలు నిలిపిన ఉదంతం కోల్కతా లో జరిగింది.
20 సంవత్సరాల వయసులో ఉన్న శ్రీజని హైదర్ కోల్కతా లోని సెయింటి గ్జేవియర్ కాలేజ్ లో హానర్స విద్యార్థిని. 45 రోజుల క్రితం ఉన్నట్టుండి ఆమె శరీరంలో కామెర్లు ప్రకోపించి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె కాలేయం పూర్తిగా దెబ్బతిని ఎందుకూ పనికిరాని స్థితికి, ఎవరూ బాగుచెయ్యలేని స్థితికి వెళ్ళిపోయింది.
మార్చ్ నెలాంతంలోనే ఆమెకు కామెర్లు వచ్చాయని తెలుసుకున్న తర్వాత మామూలుగా చేసే వైద్య చికిత్సలను చేయించారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. రోజురోజుకీ ఆమె స్థితి దిగజారుతూ ఆమె చదువు కూడా కుంటుబడింది. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయిన కామెర్ల వ్యాధి ఆమెను కోమాలోకి తీసుకెళ్ళింది. మే 27 న ఆమెకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని తెలిసి, కూతురు ప్రాణాలను కాపాడుకోవటం కోసం ఆమె తల్లి బబిత ఏమాత్రం సంశయించకుండా తన లివర్ లో 65 శాతాన్ని కూతురికి మార్పిడి చెయ్యమని వైద్యులను కోరింది.
ఇంతవరకు బాగానే వుంది. తల్లిగా కన్న కూతురు ప్రాణాలు కాపాడుకోవటం కోసం తన కాలేయంలో ముక్కను కోసి కూతురికి అమర్చమని కోరుకునేటప్పుడు ఆ తర్వాత లివర్ మళ్ళీ మామూలు సైజ్ కి పెరుగుతుందని ఆమెకు తెలియదు. ఆమె దృష్టంతా బిడ్డను బ్రతికించుకోవటం మీదనే ఉంది. అయితే అందుకు అయ్యే ఖర్చు సామాన్యమైంది కాదు. 2.2 మిలియన్ రూపాయల అవసరం పడుతుంది.
ఈ లోపులో హైదర్ కోమాలో ఉన్న సమయంలో ఆమె స్నేహితులు, టీచర్లు సోషల్ మీడియాలో ఈ సంగతి తెలియజేసి 1.8 మిలియన్ రూపాయలను చందాల రూపంలో వసూలు చేసారు. లివర్ మార్పిడి విజయవంతంగా జరిగింది. శ్రీజని హైదర్ తల్లి లివర్ డొనేట్ చెయ్యటం, ఫేస్ బుక్ ద్వారా వైద్య చికిత్సకు కావలసిన డొనేషన్స్ ని వసూలు చెయ్యటం, ఈ రెండే ఆమెను బ్రతికించాయి.
తర్వాత అంతా తెలుసుకున్న శ్రీజని హైదర్, ఫేస్ బుక్ అద్భుతం చేసిందని చెప్తూ, దానివలన తనకి జరిగిన లాభాన్ని మాటల్లో చెప్పలేనిదని అంది. నేను కోమాలో ఉన్నప్పుడు నా స్థితి ఎలా ఉండేదో తలచుకుంటే భయం వేస్తుంది. నన్ను నా కుటుంబం, నా స్నేహితులు, ఫేస్ బుక్ మాత్రమే రక్షించాయని అన్నదామె. మే 27 నుంచే ఆమె పరిస్థితి, ఆమె తండ్రి బ్యాంక్ ఖాతా వివరాలను ఫేస్ బుక్ లో ప్రచారం చేసిన ఫలితంగానే చందాలు వసూలయ్యాయి.
ఆమె తండ్రి అంజాన్ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఉద్యోగి. కష్టపడి నాలుగు లక్షలు పోగుచేసాను కానీ మొత్తం 30 లక్షలు అవసరం పడిందని, ఫేస్ బుక్ ఆ అవసరాన్ని తీర్చిందని, బంధువులు, స్నేహితుల ద్వారా ఎవరెవరికో అజ్ఞాత దాతలకు ఈ సమాచారం చేరటంతో వారి దగ్గర్నుంచి డబ్బు వచ్చిందని చెప్తూ సోషల్ మీడియా గురించి తనకు అంతవరకు ఉన్న అభిప్రాయం మారిపోయిందని అన్నారు.
శ్రీజని హైదర్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్య చికిత్స అపోలో గ్లినీగల్స్ హాస్పిటల్ లో జరిగింది. ఆ హాస్పిటల్ లోని గాస్ట్రో ఎన్ట్రియాలజిస్ట్ మహేష్ గోయంకా కేసుని వివరిస్తూ, 36 గంటల్లో అంతా చెయ్యవలసి వచ్చిందని, రోగి పరిస్థితినిబట్టి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా వైద్యం చెయ్యటానికి కూడా సమయం లేదని, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ట్రాన్స్ ప్లాంటేషన్ జరగటం ఈ తూర్పు ప్రాంతంలో ఇదే మొదటిసారని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more