చిన్న పిల్లలు దేవుడితో సమానం. అదీ కూడా అంధు విద్యార్థులు అంటే దేవం మన కళ్లముందే ఉన్నట్లు. అంలాటి అంధ విద్యార్థులపై పాఠశాల కరెస్సాండెంట్ తన ప్రతాపం చూపించారు. కాకినాడ, సర్పవరం జంక్షన్, తిమ్మాపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాలలో నిర్వాహకుడు కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లు పిల్లలలను పైశాచికంగా కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
ఈనెల 18వ తేదీ గురువారం అల్లరి చేశారంటూ సాయి, సురేంద్ర, జోసెఫ్ లను వారు విచక్షణా రహితంగా కర్రతో కట్టారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. స్వయంగా తాను కూడా అంధుడే అయిన పాఠశాల కరస్పాండెంట్, పిల్లలు అల్లరి చేశాడని ముగ్గురిని పట్టుకుని పేకబెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. వద్దు వద్దని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించలేదు. కళ్లు కనిపించక ఓ పిల్లాడు వేరేవైపు తిరిగి ఉంటే, 'ఒరేయ్ అటు కాదురా.. నేను ఇక్కడున్నాను ఇటు తిరుగు' అంటూ తనవైపు తిప్పుకొని మళ్లీ మళ్లీ బెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. ఆయనకు మరో వ్యక్తి కూడా దగ్గరుండి సహకరించాడు.
బాలల హక్కుల కమిషన్ కు చెందని అచ్యుతరావు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. అసలు పిల్లల ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యకూడదని, అలాంటిది అంధుడని కూడా చూడకుండా చిన్నారి ఒంటిమీద వాతలు తేలేలా అంతలా కొట్టడం అత్యంత హేయమైన ఘటన అని మండిపడ్డారు.
అయితే ప్రిన్సిపల్ పైశాచికాన్ని కొందరు విద్యార్థులు రహస్యంగా వీడియో తీసి , మీడియాకు అంధించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోలనకు దిగారు. పాఠశాల ప్రిన్స్ పాల్ పై విద్యార్థుల బంధువులు దాడి చేయటం జరిగింది. దీంతో డీఈవో, అధికారులను, పోలీసులను వెంట పెట్టుకొని పాఠశాలకు వెళ్లటం జరిగింది. బాధిత విద్యార్థులను విచారించి , నిర్వహాకుడు కేవీరావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు సీఫోర్సు చేయటంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై విద్యార్థి సంఘలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more