కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన సోనియాగాంధీ కుటుంబం నుంచి మరో వారసుడు తెరమీదకొచ్చాడు. ఇప్పటికే ఘోరపరాజయం పాలయి, ఒక మూల కూర్చుని వున్న కాంగ్రెస్ పార్టీ... తాజా తమ కొత్త వారసుడ్ని తెరమీదకు తీసుకొచ్చి, మీడియాను తమ పార్టీ మీద దృష్టి మళ్లించింది. అతనెవరో కాదు.. ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రాల తనయుడు అయిన రెహాన్. ఇతను బుధవారంనాడు తన స్నేహితులతో కలిసి పార్లమెంట్ హాల్లో కొద్దిసేపటి వరకు సందడి చేశాడు. లోక్ సభలోని సందర్శకుల గ్యాలరీలో కొద్దిసేపటి వరకు కూర్చొని, లోక్ సభ కార్యాకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించాడు. అలాగే పార్లమెంట్ లో వుండే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ కొద్దిసేపటివరకు రెహాన్ తన స్నేహితులతో కలిసి సందడి చేశాడు.
Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/SoniaGandhiGrandSon
గతంలో ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో ప్రియాంకగాంధీ ప్రచారాలు కొనసాగించిన సమయాల్లో రెహాన్ తోపాటు కూతురు మిరియాను కూడా తీసుకెళ్లిన సందర్భాలు వున్నాయి. అయితే అప్పుడు వారిని పార్లమెంట్ కి మాత్రం తీసుకురాలేదు. అయితే ఇప్పుడు తాజాగా మొదటిసారి ప్రియాంకగాంధీ వారసుడు పార్లమెంటుకి వచ్చాడని తెలిసిన వెంటనే అతనిని చూసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, అక్కడున్న సిబ్బంది, మీడియా మెంబర్లందరూ ఎగబడ్డారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి అయిన జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా భార్య అయిన ప్రియదర్శిని రాజే, కొడుకు మహనార్యమన్ లు కూడా పార్లమెంట్ సమావేశాలు ముగిసిని అనంతరం మీడియా కంట పడ్డారు. వీరు ఈ విధంగా పార్లమెంట్ కు హాజరు కావడంపై కొంతమేరకు ప్రాముఖ్యత సంతరించుకుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more