అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్ ల విషయానికి వచ్చేటప్పటికి వార్తలలో ఎక్కువగా విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా వినిపిస్తున్నాయని, అటువంటి ప్రచారం లో నిజముండి ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తున్నట్లయితే అలా చెయ్యటం తగదని మాజీ మంత్రి శైలజానాథ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చెయ్యరా అని ఆయన అడుగుతున్నారు. అనంతపురం ఆంధ్ర ప్రదేశ్ కి రాజధానిగా చెయ్యాలని, కనీసం రెండవ రాజధానిగానైనా చెయ్యాలని, అనంతపురం జిల్లా ఐటి హబ్ గా చెయ్యాలని కోరుతున్నానని శైలజానాథ్ అన్నారు.
వినదగునెవ్వరు చెప్పిన అని, ఆయన మాజీ మంత్రైనా, వేరే పార్టీకి చెందినా, కేవలం ఒక జిల్లా గురించే మాట్లాడుతున్నా, ఆయన చెప్పిన మాటల మీద కూడా కాస్త ఆలోచన పెట్టవలసిందే.
మన రాజధాని అంటూ హైద్రాబాద్ నే అభివృద్ధిని చేసి చివరకు దాన్ని వదిలిపెట్టేసాం కదా, రాష్ట్రంలో ఇంకా కొన్ని నగరాలను కూడా హైద్రాబాద్ కి దీటుగా అభివృద్ధి చేసివుండవలసింది అన్నది సీమాంధ్రుల ప్రధానమైన వేదనాభరితమైన వాదన. మరోసారి అలాంటి తప్పు చేస్తూ ఒక్క విజయవాడ గుంటూరు ప్రాంతాల మీదనే దృష్టంతా కేంద్రీకరించటం సరికాదన్న విషయం శైలజానాథ్ చెప్పినా వేరెవరు చెప్పినా దాని గురించి ఆలోచించవలసిన విషయమే కదా. ఈ విషయం తెలిసి కూడా ఉండవచ్చు, అదే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండవచ్చునేమో కానీ సకాలంలో ఇచ్చే సూచనలకు విలువుంటుందన్నది మర్చిపోగూడదు.
రాజధాని విజయవాడ గుంటూరు ప్రాంతాలలోనే స్థాపించాలనే నిర్ణయం జరగాలన్న పట్టుదల కూడా నిజానికి అటువంటి ఆలోచనలో పుట్టినదే. మద్రాసు పోగొట్టుకున్నాం, ఇప్పుడు హైద్రాబాద్ పోగొట్టుకున్నాం, మరోసారి విభజన జరిగి సీమ ప్రాంతం విడిపోతే... అన్న ఆలోచనే రాజధాని స్థాపన ఆంధ్రా నడిబొడ్డులో జరగాలనటానికి మూలం.
ఏమైనా హైద్రాబాద్ విషయంలో చేసిన తప్పు మాత్రం పునరావృతం కాకూడదన్నది అందరి ఆలోచన కూడా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more