వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్న లోకోక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషయంలో సరిగ్గా సరిపోతోంది.
బహిరంగంగా పాదాభివందంనం చేసినా, అధికార వితరణకు వచ్చేటప్పటికి అద్వానీని దూరంగా ఉంచిన నరేంద్ర మోదీ, ఎన్నికలలో గెలుపొందని అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీలకు మంత్రి పదవులిచ్చారు. అంతకు ముందు లోక్ సభ నాయకురాలిగా వ్యవహరించిన సుష్మా స్వరాజ్ అద్వానీ మద్దతుదారు కావటంతో ఆమెను కార్యవర్గానికి దూరంగా ఉంచారు. ఎన్నికల సమయంలో తనకి అండదండలుగా ఉండి శ్రమించిన అమిత్ షా కి పార్టీ పగ్గాలే చేతికందేట్టుగా చేసారాయన. ఎన్నికలలో పోటీయే చెయ్యని నిర్మలా సీతారామన్ ని మంత్రిని చేసారు.
ఇక ఒక ఐఏఎస్ అధికారి సేవలను అందుకోవటం కోసం ఏకంగా చట్టంలోనే సవరణ తీసుకునివచ్చారు మోదీ. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ (ట్రాయ్) కి ఛైర్మన్ పదవిలో సేవలందించిన నృపేంద్ర మిశ్రాని ప్రధానమంత్రి ఛీఫ్ సెక్రటరీగా నియమించటం కోసం ట్రాయ్ లో ఛైర్మన్, ఇతర సభ్యులుగా పనిచేసినవారికి రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వంలో వేరే శాఖల్లో పనిచెయ్యటానికి అనుమతించరాదన్న నియమంలో సవరణను బిల్లుగా ఇరు సభల్లోనూ ప్రవేశపెట్టి చట్టబద్ధం చెయ్యటం జరిగింది.
ప్రధానమంత్రిగా అధికారాలను చేపట్టినవారిని తనకి అనుకూలంగా పనిచేసే బృందాన్ని కాకుండా వేరేవాళ్ళని పెట్టుకోమని ఎవరూ అనరని అనటానికి కూడా లేదు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకి అనుకూలంగా పనేచేసేవాళ్ళని మంత్రి వర్గంలో పెట్టుకుందామనుకుంటే అధిష్టానం పడనివ్వలేదు. కానీ ఇక్కడ శక్తివంతమైన మోదీ పరిపాలన కాబట్టి, ఆయన తనకి ఎదురులేకుండా చేసుకుంటున్నారు.
మన కుటుంబాలను కానీ, పొరుగువారిని కానీ ఎంపికచేసే అధికారం మనకుండదు. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తనతో పనిచేసే మంత్రులను తనకి అనుకూలంగా ఉండేవాళ్ళని తనతోపాటు పనిచెయ్యటానికి ఎన్నుకునే వెసులుబాటుని రాజ్యాంగం కలిగించింది. దాన్ని మోదీ పూర్తిగా వాడుకున్నారు ఇంకా వాడుకుంటారు కూడా.
అందువలన, వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే నన్న సామెత నిజమేనన్నది రూఢి అవుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more