ఖజానా ఖాలీయే కానీ హామీలు నెరవేరుతాయి. చెయ్యాల్సినపని చాలావుంది, చేతిలో డబ్బుల్లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునాదుల స్థాయి నుంచి నిర్మించుకుంటూ రావాలి. కానీ ఖజానా ఖాళీ. ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితి. ప్రధాన మంత్రి మోదీ సహకారంతో గట్టెక్కే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఇచ్చిన హామీలను పూర్తి చేస్తాం- ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం రామకుప్పంలో అన్న మాటలు.
పరిస్థితి తేటతెల్లంగా ఉంది. చేతిలో డబ్బుల్లేవు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపడదామన్నా ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. అయినా చంద్రబాబు నాయుడు ఆశవీడకపోవటమే కాకుండా కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. నిరాశలోకి పోనివ్వటంలేదు.
ఇదీ అసలు సవాల్. మేనేజ్ మెంట్ అంటే ఇదే. డబ్బులుంటే మేనేజ్ చెయ్యటానికి పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఆ డబ్బే చాలావరకు మేనేజ్ చేస్తుంది. అది లేనప్పుడే చేతులు, కాళ్ళూ బంధించిన పరిస్థితి ఉన్నప్పుడే మేనేజ్ చెయ్యటంలో వ్యక్తి సామర్థ్యం బయటపడుతుంది.
ఉన్న సమస్యలు రాజధాని నిర్మాణం, సాగునీటి సమస్యలు, రాష్ట్రాభివృద్ధి తదితరమైనవి. మీ అందరి ముఖాల్లో నవ్వులు చూడాలన్నదే నా ఆశయం అన్నారు చంద్రబాబు.
హైద్రాబాద్ ని తీర్చిదిద్దింది తానేనని గుర్తు చేసిన చంద్రబాబు అలాంటి నగరాలను నాలుగైదు నిర్మస్తాం నవ్యాంధ్రలో అన్నారు చంద్రబాబు. మరి ఆ పనులన్నీ చెయ్యటానికి కావలసిన సొమ్ము లేదు సరికదా, ఎలా వస్తుందన్నదానిలో కూడా స్పష్టత లేదు. కానీ చంద్రబాబు నాయుడు చూపించింది గుండె ధైర్యం, అందరిలో నింపింది ఆత్మవిశ్వాసం.
ఇలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ముందు దేశాన్ని అభివృద్ధి చేస్తానని, అవనీతిని పారద్రోలుతానని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి రప్పిస్తానని అన్నప్పుడు కాంగ్రెస్ ఎద్దేవా చేసింది- ఏం మోదీ దగ్గరేమైనా మంత్రదండముందా అంటూ. ఎలా చేస్తారా పనులన్నీ. ఒక్కాసారే మార్పులు వచ్చేస్తాయా అంటూ ప్రశ్నించింది అప్పటి అధికార పార్టీ. మేమే 60 సంవత్సరాలలో చెయ్యలేనిది ఆయనెలా చేస్తారన్నది కాంగ్రెస్ వాదన.
అలాగే చంద్రబాబు నాయుడు మాటలు ఈ రోజు హాస్యాస్పదంగా కనిపించవచ్చు. కానీ లక్ష్యమనేది పెట్టుకోవాలి వనరులను సమీకరించుకోవాలి, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి. లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటాం అన్నది తర్వాత సంగతి కానీ లక్ష్యం వైపుగా అడుగులైతే పడతాయి కదా!
రెండు నెలల్లో రాష్ట్రంలోని సంక్షోభమంతా పోతుందని చంద్రబాబు నమ్మకంగా చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more