ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు విద్యార్థులు ఆనంద్, పూర్ణలను అభినందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలంగాణా శాసనసభలో తీర్మానం చేసారు. వారిరువురూ దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసారని ప్రశంసిస్తూ, వారితో పాటు వారికి అత్యుత్తమ శిక్షణనిచ్చిన శేఖరబాబుని కూడా కెసిఆర్ అభినందించారు.
సాదనపల్లి ఆనంద్ కుమార్, మాలవత్ పూర్ణ ఇద్దరు విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు. వారిరువురితో పాటు శిక్షకుడు నల్గొండ వాసి శేఖరబాబుకి తలా 25 లక్షల రూపాయల బహుమతిని కెసిఆర్ శాసనసభలో ప్రకటించారు.
దానితోపాటు విద్యార్థులిద్దరూ నిరుపేద కూలీల కుటుంబానికి చెందినవారవటం వలన వారిద్దరికీ చెరో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని, దానిలో బోర్ వెల్ ని, సంవత్సరానికి సరిపడా వ్యవసాయానికి ఆర్థిక సహాయాన్ని కూడా కెసిఆర్ ప్రకటించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఆనందకుమార్ అన్నపురెడ్డిపల్లి లో జూనియర్ ఇంటర్ చదివే విద్యార్థి. నిజామాబాద్ కి చెందిన పూర్ణ తాడ్వాయి లో 9 వ తరగతి విద్యార్థిని. వీరిద్దరూ శేఖరబాబు నేతృత్వంలో ఎవరెస్ట్ ని అధిరోహించటానికి 72 రోజుల టూర్ లో వెళ్ళారు. పై ఫొటోలో వీరిరువురినీ మొదటి నుంచి ప్రోత్సహించిన మాజీ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ ని చూడవచ్చు. వీరివురు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో చదువుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more