ప్రణాళికా సంఘం ప్రమాణాల ప్రకారం ప్రత్యేక హోదాకు అర్హతలు గల రాష్ట్రాలు ఇవి- అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు.
ప్రత్యేక హోదాకి కావలసిన అర్హతలు-
1. రాష్ట్రం పర్వత ప్రాంతాలతో కూడి సమతలంగా లేక రాకపోకలకు కష్టసాధ్యమైన ఉపరితలంతో ఉండాలి.
2. జనాభా తక్కువ సాంద్రత కలిగివుండాలి.
3. జనాభాలో గిరిజనుల శాతం ఎక్కువగా ఉండాలి.
4. పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉండాలి
5. ఆర్థికంగానూ, మౌలిక సౌకర్యాల పరంగానూ వెనకబడివుండాలి.
6. రాష్ట్ర ఆదాయ వనరులు ఆధారపడదగ్గవిగా లేకుండా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ కి పై వాటిల్లో ఆఖరు అంశం తప్ప మరేదీ లేదు. ప్రధాన ఆదాయ కేంద్రమైన హైద్రాబాద్ లేకపోవటంతో ఆదాయ వనరులు అంతగా లేవు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా లభిస్తుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారవేత్తలతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. అందులో చాలామంది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టటానికి సంసిద్ధతను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించగానే బీహార్, రాజస్తాన్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కలిగించమని డిమాండ్ చెయ్యటం మొదలుపెట్టాయి. కేంద్రప్రభుత్వానికి వాటి మీద నిర్ణయం తీసుకోవటం కూడా మిగిలివుంది.
గాడ్గిల్ ముఖర్జీ లు సూచించిన విధానం ప్రకారం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో కలిగే ఆర్థిక లాభాలు ఇవి-
1. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులలో 30 శాతం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు పోతుంది.
2. సామాన్యంగా 30 శాతం గ్రాంట్, 70 శాతం ఋణంగా లభించే స్థానంలో ప్రత్యేక హోదాగల రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్, 10 శాతం ఋణంగా లభిస్తుంది.
దీని వలన రాష్ట్రం త్వరగా ఆర్థికంగా పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది.
అయితే దీనిమీద ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు. ఈ విషయంలో రాజ్య సభలో పట్టుపట్టిన వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రణాళిక అమలు మంత్రి రావ్ ఇందర్ జిత్ సింగ్ తో సమావేశమయ్యారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more