టాలీవుడ్ మరో మంచి నటిని కోల్పోయింది. టాలీవుడ్ పరిశ్రమలో తెలంగాణ యాసతో ప్రేక్షకుల మనస్సు దొచుకున్న తెలంగాణ శకుంతల శుక్రవారం (63) అర్థరాత్రి దాటిన తరువాత గుండెపోటుతో ఆక్మస్మిక మరణం చెందింది. హైదరాబాద్ శివారు కొంపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటురావడంతో సురారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణ పాత్రలు పోషించిన ఈమె 1981లో తెలుగు తెర అరంగ్రేటం చేసిన ఈమె ఇప్పటి వరకు 70 చిత్రాల్లో నటించారు. ఈమె నటించిన తొలి చిత్రం భూమి కాగా, ఆఖరు చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. గులాబి చిత్రంతో ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ‘ఓసేయ్ రాములమ్మ ’ సినిమాతో ఆమెకు ‘తెలంగాణ శకుంతల ’ అనే ముద్ర పడిపోయింది. తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించిన ఆమె కామెడీ, విలన్, పోలీస్ పాత్రలు పోషించి తన నటనా ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది.
ఆమె నటించిన చిత్రాల్లో.. ఆహ నా పెళ్లంట, గులాబీ, నువ్వునేను, ఎవడిగోల వాడిదే, సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటీగా శకుంతల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాసతో మాట్లాడుతూ టాలీవుడ్ లో ప్రయాణం సాగిస్తున్న ఈమె ఇలా అకస్మాత్తుగా మరణించడంతో యావత్ తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బాంతికి గురైంది.
శకుంతల సినీ పరిశ్రమకు చేసిన సేవను, ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. శకుంతల మరణం టాలీవుడ్ కు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి జరగాలని సంతాపం తెలిపారు. టాలీవుడ్ లో శ్రీహరి నుండి మొదలైన విషాదాలు నేడు తెలంగాణ శకుంతల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ ప్రముఖ నటుడు వరుసగా తిరిగిరాని లోకాలకు వెళ్ళి పోతుండటంతో టాలీవుడ్ ని తీవ్రంగా కలిచివేస్తుంది.
Knr
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more